UP Released New Population Control Bill 2021 Proposing Two Children Policy :
జనాభా నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావటానికి కసరత్తులు చేస్తోంది. తక్కువ సంతానం ఉన్న వారికి రకరకాలు ప్రోత్సహకాలు ఇవ్వడంతో పాటు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హతతో పాటు చాలా పథకాల్లో కోత విధించనుంది. దీని కోసం ఓ ముసాయిదాను రూపొందించింది. యూపీ జనాభా బిల్లు 2021పై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు జూలై 19వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే..
ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు కన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోనున్నారు. వారికి ఎటువంటి ప్రభుత్వ సబ్సిడీ, ప్రభుత్వం చేపట్టే ఎటువంటి సంక్షేమ పథకాలు అందవు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లోనూ వాళ్లు పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ కేవలం ముస్లింలను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నా వచ్చే ఏడాది యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుభార్యత్వం విషయంలో వేరు వేరు సంతానాన్ని పరిగణలోకి తీసుకోనుండటం ముస్లింలకు కొంత ఊరట కలిగించే అంశం.
UP New Population Control Bill :
ఒక బిడ్డ ఉంటే..
కేవలం ఇద్దర్నే కన్నవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నవారికి సాధారణ వడ్డీ రేటుతో ఇండ్ల నిర్మాణం కోసం రుణాలు ఇవ్వనున్నారు. నీరు, విద్యుత్తు, ఇంటి పన్నుల్లో రిబేట్ ఇస్తారట. ఒక బిడ్డనే కన్న తర్వాత ఆపరేషన్ చేయించుకున్నవారికి ఉచిత ఆరోగ్య సదుపాయాలు కల్పించనున్నారు. ఆ బిడ్డ 20 ఏళ్ల వచ్చే వరకు బీమా కల్పించనున్నారు. ఐఐఎం, ఏయిమ్స్ లాంటి విద్యాసంస్థల్లో ఆ పిల్లలకు అడ్మిషన్ సులువుగా లభిస్తుందని ముసాయిదాలో పేర్కొన్నారు. ఇద్దరే ముద్దు అన్న విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్ల పొందుతారు. ఇక ఒక్క పిల్లవాడే ఉన్నవాళ్లకు నాలుగు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు ముసాయిదాలో వెల్లడించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఒక్కరినే కంటే అబ్బాయితే రూ.80 వేలు, అమ్మాయి అయితే రూ.లక్ష ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.
Must Read ;- లేఖాస్త్రం : ప్రభుత్వ ఉద్యోగులు పస్తులు ఉండాల్సిందేనా!











