( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
యాంటీ డ్రగ్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నవిశాఖ సిటీ పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అల్లిపురం సమీపంలోని ఓ లాడ్జిలో 29.415 కేజీల వెండి ఆభరణాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే ప్రాంతంలోని మరో హోటల్లో నిర్వహించిన తనిఖీల్లో సరిగ్గా లెక్కలు చూపని కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు కలిగివున్న భరత్ కుమార్ రాజ్ పురోహిథ్, చోటారం నుంచి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ నుండి బస్లో నగదు తీసుకువచ్చినట్లు పోలీసులకు తెలిపారు. వాటితో పాటు దువ్వాడ పరిధిలో ఇన్నోవా వాహనంలో 100 కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ రెండు లక్షలు ఉంటుందని ఏసీబీ ప్రేమ్ కాజల్ తెలిపారు.
Must Read ;- ఆందోళన కలిగిస్తున్న డ్రగ్ కల్చర్.. విద్యార్థులే టార్గెట్











