భారత ప్రధాని మోదీకి అప్రకటిత పాపులారిటీని గిఫ్ట్ గా ఇచ్చారు. నేరుగా కాకున్నా.. ట్విట్టర్ రూపేణా ఆ పాపులారిటీ వచ్చింది. రెండు రోజుల క్రితం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సోషల్ మీడియా సంస్థ బ్లాక్ చేసింది. ట్రంప్ పర్సనల్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది. దీంతో మోదీకి ఆ గిఫ్ట్ వచ్చినట్టైంది.
అమెరికా కాపిటోల్పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడికి మద్దతుగా ట్రంప్ ట్వీట్లు చేయడం, గతంలోనూ పలు మార్లు ట్రంప్ వివాదాస్పద ట్వీట్ లు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ట్రంప్ ఖాతాను తొలగించింది. ఆయన పర్సనల్, అధికారిక అకౌంట్ లతో పాటు సంబంధిత అకౌంట్లన్నీ బ్లాక్ చేసింది.
మొన్నటివరకు ప్రపంచ వ్యాప్తంగా పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో ఉండేవారు. డొనాల్డ్ ట్రంప్ కి 88.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ప్రధాని మోదీకి 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను ఆ సోషల్ మీడియా సంస్థ బ్లాక్ చేసింది. దీంతో యాక్టివ్గా ఉన్న రాజకీయ నాయకుల కేటగిరీలో.. వరల్డ్ నెంబర్ వన్ ట్విటర్ ఫాలోవర్ల రికార్డు భారత ప్రధాని మోదీ కే దక్కుతోంది.
కానీ ఓవరాల్ ఫాలోవర్ల లెక్కలు చూస్తే.. మోడీ 12వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఈయనకు అత్యధికంగా 127 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఏ విభాగానికి చెందిన వ్యక్తులకు కూడా ఫాలోవర్లు లేరు
మోదీకంటే ముందు..
మోదీ కంటే..ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన వారిలో.. బారక్ ఒబామా, జస్టిన్ బీబర్ (పాప్ సింగర్), కేటీ పెర్రీ (అమెరికన్ సింగర్), రిహన్నా (అమెరికా పాప్ సింగర్), క్రిస్టియానో రొనాల్డో (ఫుట్ బాల్ ప్లేయర్), టేలర్ స్విప్ట్(సింగర్), లేడీ గాగా (ఏంజెలీనా జర్మనోటా-సింగర్), ఆరియానా గ్రాండే (గాయని, నటి, రచయిత), ఎలిన్ (కమెడియన్, టాక్ షో హోస్టర్), యూట్యూబ్ (సోషల్ మీడియా ప్లాట్ ఫాం-గూగుల్), కిమ్ కర్దశియన్ (మీడియా, సోషలిస్ట్, వ్యాపారవేత్త) లు ముందున్నారు. మోదీ 12వ స్థానంలో ఉన్నారు.
మిగతావారు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందని, త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినున్న జో బైడెన్ కు 23.3 మిలియన్ల మంది, మన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు 24.2 మిలియన్ల మంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు 21.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
2009లో చేరిన మోదీ..
కాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోడీ ట్విట్టర్ ఖాతాలో చేరారు. 2010నాటికి లక్ష ఫాలోవర్ల మైలురాయిని దాటారు. మరుసటి ఏడాది నాలుగులక్షల మంది ఫాలో అయ్యేవారు. 2014నాటికి 12 మిలియన్ లు ఉండగా తాజాగా 64మిలియన్లకు చేరారు.
Must Read ;- సంపాదకీయం : మోడీజీ.. మీ జిమ్మిక్ పనిచేస్తుందా?