January 29, 2023 10:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆ గట్టునో, ఈ గట్టునో.. బంద్‌తో బయట పడనున్న వైసీపీ వైఖరి

అధికార వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ఈ నెల 5వ తేదీన జరిగే బంద్‌తో ఆ పార్టీ వైఖరి స్పష్టం కానుంది.

March 3, 2021 at 11:20 AM
in Andhra Pradesh, Latest News
రాష్ట్ర బంద్ - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంద్ రోజున రాష్ట్ర ప్రభుత్వం రంగు బయట పడనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ గత నెల ఆరవ తేదీ నుంచి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులు ఉద్యమ తీవ్రతను దశల వారీగా పెంచుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ విజయవంతం కావాలంటే అందుకు ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం.

స్వచ్ఛంద బంద్‌కు  సహకరిస్తారా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఆంధ్రుల సెంటిమెంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోమని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని, జేఏసీతో కలిసి కార్మికులకు అండగా నిలుస్తామని.. ఒక్కటేంటి ఎన్నో ప్రకటనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. అందులో భాగంగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దఫదఫాలుగా స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులతో కమ్యూనిస్టు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాము సాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖ గురించి ప్రస్తావించని రోజంటూ లేదు. విశాఖ విమానాశ్రయంలో ట్రేడ్ యూనియన్ నాయకులతో గంటన్నరపాటు ముఖ్యమంత్రి చర్చలు జరిపి  ‘ నేనున్నా’  అంటూ హామీ ఇచ్చారు. మరి అటువంటి రాష్ట్రప్రభుత్వం బంద్ విజయవంతం చేసేందుకు ఏ మేరకు సహకరిస్తుందో శుక్రవారం తేటతెల్లం కానుంది. ప్రభుత్వ కార్యాలయాలను, ఆర్టీసీ బస్సులను, ఇతర వ్యవస్థలను ఆరోజు నడవకుండా ప్రభుత్వం చేయగలిగితే బంద్ సంపూర్ణం అవుతుంది. బంద్ ఎంత విజయవంతం అయితే.. ఆంధ్రుల సెంటిమెంట్ అంత బలంగా కేంద్రానికి చేరుతుంది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తుందా? లేక కార్మికుల తరఫున నిలుస్తుందా అన్నది తేలిపోనుంది.

స్పందించని కేంద్రం..

రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఎన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. పైగా  పరిశ్రమ బిడ్డింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాబోయే రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కమిటీని నియమించింది. దీంతో కార్మిక సంఘాలు ఉద్యమ తీవ్రతను మరో స్థాయికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.  అందులో భాగంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మార్చి 5న బంద్ నిర్వహించాలని అందుకు ప్రజలు, అన్ని వర్గాలు సహకరించాలని కమిటీ సభ్యులు అన్ని వర్గాల మద్దతును కూడగడుతున్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర పరిశ్రమలలాగే  చూస్తోందని, దానిని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగాల కైనా సిద్ధమని,  పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులంతా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.

వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపైనే ఉంటారా?

అధికార పార్టీ వైఎస్ఆర్సీపి నేతల మనసుల్లో ఈ ఏముందో తెలియదు కానీ.. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పదే పదే చెబుతున్నారు. అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో  భాగస్వాములవుతున్నారు. సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్రను రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు నిర్వహించారు. అయితే ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారా? లేక ప్రజల పక్షాన నిలబడి ముందుకు వెళ్తున్నారా అన్నది బంద్ రోజున స్పష్టం కానుంది. సాధారణంగా బంద్ రోజున తెరిచే దుకాణాలను మూసి వేయించడం, రవాణా వాహనాలు రోడ్లపై తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు పని చేయకుండా ఆందోళనలు నిర్వహించడం, ఈ క్రమంలో రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు చేయడం బంద్ విజయవంతం కావడంలో కీలకంగా మారుతాయి. బంద్ లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ఎంతమంది ముందుకు వస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే, బలవంతపు చర్యలు సర్వసాధారణం.

ఎన్నికల క్యాంపెయిన్‌గా..

కాగా విజయసాయిరెడ్డి చేసిన పాదయాత్ర ఎన్నికల క్యాంపెయిన్‌గా నిలిచిందని అనేక విమర్శలు ఉన్నాయి. అన్ని  నియోజకవర్గాలను కవర్ చేస్తూ, ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ సాగిన పాదయాత్ర ,  బహిరంగ సభ ఈ వాదనకు బలం చేకూర్చింది. మరి అటువంటి డ్రామాలే బంద్ రోజున ఆడతారా లేక చిత్తశుద్ధితో బందుకు సహకరిస్తారా అన్నది తేలాల్సి ఉంది.  మరోవైపు విశాఖలో ప్రారంభమైన ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

బంద్ విజయవంతమైతే..

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రవాణా వాహనాలు నిలిచిపోతే.. ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా పడుతుంది. ఈ ఉద్యమం గురించి ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ మొదలవుతుంది. అక్కడి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశంపైన ఆందోళనలు తీవ్రతరం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. వేలాది ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఎక్కడికక్కడ ఆగితే ఉద్యమ సెగ కేంద్ర ప్రభుత్వాన్ని తాకుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఆర్థికపరంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ,  ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే గాని విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

బీజేపీ రోజుకో ప్రకటన..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రైవేటీకరణ అంత సులభం కాదని స్పష్టం చేశారు. సోమ, మంగళ వారాల్లో విశాఖలో పర్యటించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండు విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. ప్రైవేటీకరణ వల్ల స్టీల్ ప్లాంట్ బాగుపడుతుందని, ఆ సంస్థ మనుగడ కోసమే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. మరుసటి రోజే మరో వ్యాఖ్య చేశారు. ప్రైవేటీకరణ అంత త్వరగా అయ్యే ప్రక్రియ కాదని, స్టీల్ ప్లాంట్ కంటే ముందుగా మరో 34 సంస్థలను ప్రైవేటీకరించాల్సి ఉందని, అది పూర్తయ్యాక స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుందని సెలవిచ్చారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపి నాయకులు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ పై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం సన్నగిల్లింది.

Must Read : ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

Tags: ap newsbandh for steel plant privitizationbjp in different wayscm jaganEditorspickis ycp support steel plant bandhJagan Padayatrajanasena bjpjanasena bjp alliancejanasena bjp alliance updatesjanasena bjp vizag newsjanasena bjp vizag steel plantJanasena Nadendla Manohar Commentsjanasena pawan kalyanjanasena steel plant privatizationLatest Newsleotopnadendla manoharNadendla Manohar 10TV InterviewNadendla Manohar Exclusive InterviewNadendla Manohar InterviewNadendla Manohar Interview On PawanNadendla Manohar JanasenaNadendla Manohar Question Hourpawan kalyanstate bandh for steel plant privitizationsteel plant privatizationsteel plant privitization newstelugu newsVizag Steel Plantvizag steel plant privatizationVizagvisionvizagvisionDevisionalVizagvisionnewsvizagvisiontourismycp on steel plant bandhycp stand on steel plant will be come out on state bandhycp stand on steel plant will be out on state bandhycp supports steel plant bandhysrcp on steel plant bandh
Previous Post

రాజమౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Next Post

రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

by Leo Editor
January 6, 2023 5:15 pm

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వేల పాటల వేటూరి (జయంతి ప్రత్యేకం) 

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In