తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. ఇప్పటివరకు ఆత్మీయ సమ్మెళనాలు, మీటింగ్స్, దీక్షలకు పరిమితమైన షర్మిల, ఇకపై పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేయనున్నారు. ఈ క్రమంలో గతంలో వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగిన నాయకులు, అభిమాలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర ఉన్న కొండ సురేఖ దంపతులను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తాజా సమాచారం. ఈ మేరకు సురేఖ అనుచరులతో షర్మిల మద్దతదారులు సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తామున్నపార్టీలోనే (కాంగ్రెస్) ఉంటారా? లేక షర్మిల పార్టీలో చేరుతారా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతామని సురేఖ దంపతులు తమ అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది.
Must Read ;- సాక్షిలో విజయమ్మ, షర్మిల మాత్రమే.. డా.సునీత కనిపించలేదా?











