తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఈటల రాజేందర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం లోటస్ పాండ్ లో అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని అన్నారు. టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చే నాయకులపై కేసీఆర్ సర్కారు కేసులు పెడుతుందని, అందుకే వాళ్లంతా బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
కార్యకర్తలకే పార్టీలో పెద్ద పీట వేయబోతున్నామని, కార్యకర్తలు చెప్పిందే తన పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలనుగుణంగా తమ పార్టీ విధి విధానాలు ఉంటాయని షర్మిల అన్నారు.
Must Read ;- లోటస్ పాండ్ మళ్లీ కళకళ .. షర్మిల పార్టీ సన్నాహక సమావేశం నేడు