నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రవర్తన వింతగా ఉందని ఏపీఐఐసీ అధ్యక్షురాలు రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే చిన్న మెదడు చితికిందేమోనన్న అనుమానం కలిగుతుందని మీడియా ముఖ్యంగా వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ఆయనపైన ఆయనకే నమ్మకం లేనట్టు అనిపిస్తుందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ నడుస్తున్నారని రోజా నిమ్మగడ్డ ప్రవర్తనను దుయ్యబట్టారు. తనకు నచ్చిన వారినే తెచ్చిపెట్టుకుంటున్నారని రోజా చెప్పుకొచ్చారు. చిత్తూరు, గుంటూరు ఎస్పీ, కలెక్టర్లను మార్చి ఎన్నికలు నిర్వహించారని.. అయినా కూడా ఎన్నకల ఏకగ్రీవాలను ఆపడమెంటని ప్రశ్నించారు. ప్రజల తీర్పును నిమ్మగడ్డ గౌరవించడం లేదని.. వాటిని హాస్యాస్పదంగా మార్చుతున్నారని చెప్పారు.
జిల్లాల్లో 454 పంచాయితీలకు గాను, 110 ఏకగ్రీవాలు నమోదయ్యాయి. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్.. వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి నిర్ణయాలు వెలువడేంత వరకు వాటినలాగే ఉంచాలని పేర్కొంది.
Must Read ;- ‘నిమ్మగడ్డ జాగ్రత్త.. ఏప్రిల్ 1 తరువాత శాల్తీ లేపేస్తాం’