జగన్ బెయిల్ రద్దవుతుందంటూ తిరుపతి ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేయడం అసక్తికరంగా మారింది. ఎన్నికల్లో లబ్ధి పొందటానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమా లేక వారికేమైనా సమాచారం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ బెయిల్ రద్దుపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
జగన్ జైలు కెళితే సీఎం ఎవరు?
ఏపీ సీఎం జగన్ బైయిల్ రద్దయి జైలుకెళ్తే.. మరి ఎవరు సీఎం అవుతారు…? ఒక వేళ జగన్ జైలుకెళ్తే.. ఆయన భార్య భారతి బాధ్యతలు తీసుకుంటారా అనే విషయాలు గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో షికారు చేస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. తాజాగా తిరుపతి ప్రచారంలో బీజేపీ నాయకులు సంచలన కామెంట్స్ చేస్తుండటంతో జైలుకు వెళ్తారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తిరుపతిలో బీజేపీ నేతల నోట అదే మాట..
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ నాలుగు రోజుల క్రితం తిరుపతిలో జగన్పై సంచలన కామెంట్స్ చేశారు. ‘వైఎస్ జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దు అయ్యే అవకాశం ఉంది. జగన్ హయాంలో రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనమైందని, ప్రస్తుతం ఏపీలో అవినీతి, అప్పులే మిగిలాయని’’ ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తిరుపతి ప్రచారంలో ఎంపీ విజయ్ సాయిరెడ్డి, సీఎం జగన్ లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారు. బీజేపీ ఏంపీ జీవీఎల్ కూడ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇలా బీజేపీ నేతలందరూ వరుసగా జగన్ బెయిల్ గురించి వ్యాఖ్యలు చేస్తుండటం రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో కేంద్రం నుంచి వారికేమైనా సమాచారం ఉందా లేక.. తిరుపతి ఎన్నికల్లో లబ్ధికి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా? అనే చర్చలు సాగుతున్నాయి. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడ వేయడం గమనార్హం.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు చేయండి.. హైకోర్టులో ఎంపీ రఘురామరాజు పిటిషన్











