పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవన్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో పవన్ ఒక బందిపోటు పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
Must Read:-పవన్ అభిమానులను ఊరిస్తున్న డైరెక్టర్ క్రిష్
అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాకు ‘ఇస్మార్ట్ శంకర్‘ భామ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారని ఆ వార్త సారాంశం. ఇప్పటికే అనేకమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శకుడు క్రిష్ చివరికి నిధి అగర్వాల్ ను ఓకే చేశాడని తెలుస్తోంది. అతిత్వరలోనే ఈ వార్తకు సంబంధించిన విషయాలను దర్శకుడు క్రిష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తాడని సమాచారం. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ 27వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read:-పవన్ కళ్యాణ్ పై నారాయణ సంచలన కామెంట్స్
అసలే పీరియాడిక్ డ్రామాలను తెరకెక్కించడంలో క్రిష్ సిద్ధహస్తుడు. అలాంటి క్రిష్, పవన్ వంటి స్టార్ హీరోతో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో అని ఫాన్స్ ఇప్పటి నుండే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ను హిరోయిన్ గా తీసుకున్నారని వస్తున్న వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.