‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది చలాకీ బ్యూటీ రష్మిక మందన్నా. తొలి చిత్రం ఛలో విజయం సాధించడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. ఇలా వరుసగా తను నటించిన సినిమాలన్నీ విజయం సాధించడంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తోంది. ఈ కన్నడ భామ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా కెరీర్ లో దూసుకెళుతున్నరష్మిక ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.
రష్మకి క్యూట్ లుక్స్కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. అందుకే రష్మిక నేషనల్ క్రష్ గానూ మారిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల ఓ అభిమాని రష్మికను కలిసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్పేట అని తెలుసుకొని మరీ ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు హీరోయిన్ రష్మిక ఇంటిని మాత్రం కనిపెట్టగలిగాడు. అయితే.. రష్మిక షూటింగ్ కోసం ముంబై వెళ్లడంతో ఆమెను కలవకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ రష్మిక స్పందించింది.
ఓ అభిమాని నన్ను కలిసేందుకు చాలా దూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు ఇప్పడే నాకు తెలిసింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చాలా బాధగా ఉంది కానీ.. తప్పకుండా ఏదో ఒక రోజు అతన్ని కలుస్తానన్న నమ్మకం ఉంది అంటూ రష్మిక ట్వీట్ చేసింది. టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి.. అక్కడ కూడా సక్సస్ సాధిస్తుందేమో చూడాలి.
Must Read ;- రష్మిక తీసుకోవాలనుకున్న సంచలన నిర్ణయం ఏమిటి?