అక్కినేని నాగార్జున ఎర్లియర్ గా ‘మన్మథుడు 2’ సినిమాలో నటించారు. ఆ మూవీ ఆయన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తదుపరి చిత్రాల్ని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. అసిషోర్ సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. దియామీర్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేశారు మేకర్స్.
2013 లో హైద్రాబాద్ లో జరిగిన సీరియల్ బాండ్ బ్లాస్ట్స్ సంఘటన ప్రేరణతో ఫిక్షనల్ గా మలిచిన కథతో వైల్డ్ డాగ్ తెరకెక్కింది. ఇందులో యన్.ఐ.ఏ ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్నారు. సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేస్ ను వంద మంది క్రూతో నాగ్ అన్వేషించడం ఇందులో ప్రధానంగా సాగుతుంది. ఈ ప్రయత్నంలో ఎలాంటి సంఘనటలు చోటు చేసుకుంటాయి అన్నదే మిగతా కథ. ఏప్రిల్ 2 విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను మార్చ్ 12 సాయంత్రం గం. 4:05 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని దియా మీర్జా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేసింది. మరి ఈ సినిమా నాగార్జునకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ప్రవీణ్ తో సత్తా చూపించనున్న కింగ్ నాగార్జున
The most awaited announcement is here 💥#WildDogTrailer on 12th March at 4:05 PM! Can’t WAIT 🙌🏼@iamnagarjuna @ahishor @MusicThaman @SaiyamiKher @Deonidas @pasha_always @MatineeEnt #WildDogOnApril2nd#WildDog pic.twitter.com/HPOCTeXq2e
— Dia Mirza (@deespeak) March 7, 2021