బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తానే స్వయంగా ఆ విషయాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసి.. అభిమానులకు ఆందోళన కలిగించాడు. బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు ఇటీవల కరోనా బారిన పడి.. ప్రస్తుతం డాక్టర్ సలహాల్ని పాటిస్తూ.. హోం క్వారంటైన్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కూడా తానూ హోం క్వారంటైన్ లో ఉన్నానని వివరించినా.. ఈరోజు హాస్పిటల్ లోకి చేరినట్టు వార్తలొచ్చాయి. దాంతో అక్కీ పరిస్థితి సీరియస్ గా ఉందనే సందేహాలు తలెత్తాయి. అయితే .. హాస్పిటల్ లో ఉన్న అక్షయ్ తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు.
తాను క్షేమంగానే ఉన్నానని, కేవలం డాక్టర్ల సలహా మేరకే ఆసుపత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని, మీరు కూడా జాగ్రత్తగా ఉండండని వివరణ ఇచ్చాడు. మీ ప్రార్ధనల ఫలితంగా నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని చెప్పాడు. ఆ మధ్య ఎప్పుడో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చి.. కోలుకున్నాడు. ఇప్పుడు మరోసారి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో.. అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నిజానికి ఈ రోజు అక్షయ్ కుమార్ కొత్త చిత్రం రామ్ సేతు షూటింగ్ లో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో షూట్ లో పాల్గొనాల్సి ఉంది. షూట్ కు వెళ్ళేముందు యూనిట్ లో ఉన్నవారందరికీ కరోనా టెస్ట్ చేయించగా.. అందులో 45 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Must Read ;- బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు కరోనా పాజిటివ్
— Akshay Kumar (@akshaykumar) April 5, 2021