ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. కొద్ది రోజులుగా బాలీవుడ్ లోని పలువురు నటీనటులు కరోనా బారిన పడుతుండడం బీ బౌన్ వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తోంది. రణబీర్ కపూర్, ఆమిర్ ఖాన్, పరేశ్ రావల్, కార్తిక్ ఆర్యన్, మనోజ్ బాజ్ పాయ్ లకు ఈ మధ్యకాలంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియాభట్ కూడా వచ్చి చేరింది.
ఆలియా భట్ తనకు కరోనా సోకిన సంగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఫలితం తెలిసిన వెంటనే నేను హోం ఐసోలేషన్ కు వెళ్ళాను. డాక్టర్స్ సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు . టేక్ కేర్ అంటూ.. ఆలియా తెలిపింది.
ప్రస్తుతం ఆలియా భట్ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీతో పాటు.. బ్రహ్మాస్త్ర, గంగూబాయ్ కతియా వాడిలాంటి క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. దాంతో ఆమె ఆయా సినిమాల షూటింగ్ లో పాల్గొనడం కష్టమే కాబట్టి.. ఆ మూవీస్ షూటింగ్ మరింత ఆలస్యం కావచ్చు. మరి ఆమె ఎప్పుడు కరోనా నుంచి కోలుకొని షూటింగ్స్ లో తిరిగి పాల్గొంటుందో చూడాలి.
Also Read:ప్రియాంక గాంధీకి కరోనా