యెంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చిందనే మాట వినే ఉంటాం. బహుశా ఈ మాట బసంత్ కుమార్ వ్యవహారానికి సరిగ్గా సరిపోతుంది. నిమ్మగడ్డ తిరుమల పర్యటన ఏమో గానీ.. అది కాస్త బసంత్ కుమార్ పై వేటు పడేలా చేసింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరుమలను సందర్శించిన సంగతి తెలిసిందే. వారితో పాటు తిరుమల దర్శనంలో పాల్గొన్న తిరుపతి జేఇఓ బసంత్ కుమార్ బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. అదేంటీ.. తిరుమల దర్శనం తప్పా.. లేక నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో పాటు పాల్గొనడం తప్పా అని ఆలోచిస్తున్నారా?

ప్రభత్వం సీరియస్
జగన్ ప్రభుత్వాన్ని ఎదిరించి మరీ కోర్టు అనుమతులతో ఎన్నికలు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ పైన అసలే ప్రభుత్వం కోపంతో మండిపడిపోతుంది. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డను ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ అధికారి కలిసినా వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎన్నికల అభ్జర్వర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బసంత్.. నిమ్మగడ్డ తిరుమల పర్యటన తెలియగానే వారిని కలవడానికి వెళ్లారు. తనకు అవసరం లేకపోయినా కూడా వెళ్లాడంటూ ప్రభుత్వం అతనిపై కత్తిగట్టింది. వెంటనే అతని అంతర్గత వ్యక్తుల ద్వారా సమాచారాలు సేకరించిన ప్రభుత్వం.. చివరికి నిమ్మగడ్డ పర్యటన చాలా సాధారణమైనదైనా.. అత్యుత్సాహం చూపాడనే నెపంతో బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బదిలీ వేటు పడ్డా కానీ.. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అభ్జర్వర్గా కొనసాగవచ్చని తెలిపింది.
Must Read ;- ‘నిమ్మగడ్డ జాగ్రత్త.. ఏప్రిల్ 1 తరువాత శాల్తీ లేపేస్తాం’
మరీ ఇంత నిజాయితా..
పెళ్లంటే ఎన్ని ఖర్చులు.. లక్షల్లో వ్యవహారం.. సామాన్య ప్రజలే లక్షలు ఖర్చు పెట్టి చేయాలనుకుంటారు. ఇక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి తన పిల్లల పెళ్లిళ్లు ఇక ఏ స్థాయిలో చేయాలనుకుంటారు. కనీసం ఊహించడం కూడా కష్టమే కదా. కానీ ఐఏఎస్ బసంత్ కుమార్ తన కుమార్తె పెళ్లికి కేవలం 16 వేల 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి అందూ నోరెళ్ల బెట్టేలా చేశాడు. అంతేనా.. కొడుకు పెళ్లి కూడా గత సంవత్సరం ఫిబ్రవరిలో చేశారు. వారుసుడి పెళ్లి కదా.. ఘనంగా చేసుంటారులే అనుకుంటున్నారా? లేదండీ.. కుమార్తె పెళ్లికంటే కాస్త ఎక్కువ ఖర్చైంది అంతే.. ఎంతంటారా? 36 వేలు. పెళ్లి బట్టలు కొనడానికి కూడా సరిపోవు. కానీ అతని ఉద్దేశంలో డబ్బు కంటే వచ్చిన వారి ఆశీర్వాదం ముఖ్యం. అలాగని ప్రముఖులు విచ్ఛేయలేదనుకోకండి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రముఖులు దంపతులను ఆశీర్వదించారు కూడా.

నిజాయితీ పరులు మాకు పనికిరారు..
ఇంత నిజాయితిగా ఉంటే మాకెందుకు? మాకు వ్యతిరేకంగా వెళ్లాడా అంతే.. ఇక వేటేస్తాం. ప్రస్తుతం బసంత్ విషయంలో జరిగింది కూడా అదే. ప్రభుత్వాన్న వ్యతిరేకించడానికో.. లేదా నిమ్మగడ్డకు మద్దతు పలకడానికో బసంత్ అక్కడకు చేరుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యాలు కానీ, చర్చలు, చర్యలు ఏవీ చేపట్టలేదు. అతని చేసిందల్లా కేవలం నిమ్మగడ్డ పర్యటనను పర్యవేక్షించడం. అదే ప్రభుత్వ కాటుకు బలయ్యేలా చేసింది.
Also Read ;- నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య











