Minister Perni Nani And Movie Star Posani’s Comments Have Damaged The Image Of Jagan :
టాలీవుడ్ మూవీ రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్ లో అమ్మకాలను వ్యతిరేకించి, వైసీపీ నాయకులను సన్యాసులుగా పోల్చారు. కాగా వైసీపీ పార్టీ దానికి ప్రతిగా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి కుల ప్రస్తావన తెస్తూ కొన్ని అసభ్య పదజాలన్ని పవన్ను ఉద్దేశిస్తూ అనడం, అనంతరం పోసాని మురళీకృష్ణ తను జగన్ అభిమానిని అంటూ పవన్ పై తీవ్రంగా రాజకీయంగా, వ్యక్తి గతంగా విమర్శలు చేశారు. దీనిపై పవన్ తన దైన శైలిలో ట్విట్టర్లో సెటైర్లు వేస్తూ సమాధానం ఇచ్చారు. ఇక ఇంతటితో పోసాని ఆగకుండా మరుసటి రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి శృతి మించి పవన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం, అనంతరం పవన్ అభిమానులు దాడికి యత్నించడం తెలిసిందే. మంత్రి పేర్ని నాని (Minister Perni Nani )ప్రెస్ మీట్ లో కుల ప్రస్తావన తెస్తూ పవన్ ను అసభ్యకర పదజాలంతో మాట్లాడిన తీరు, పోసాని మురళి కృష్ణ మొదటి ప్రెస్ మీట్ లో వీడియో క్లిపింగ్స్ తో సహా ప్రెస్ మీట్ కండెక్టు చేయడం, మరుసటి రోజు ప్రెస్ మీట్ లో పవన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ బూతుల పర్వం గమనిస్తే ఈ ప్రెస్ మీట్ ల వెనక జగన్ ప్రోద్బలం ఉందనే పూర్తిగా అర్థం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాపు, బలిజ సంఘాల ఆగ్రహం
కుల ప్రస్తావన తెచ్చి పవన్ను దూషించడాన్ని రాష్ట్రంలోని కాపు, బలిజ సంఘాల నేతలు పూర్తిగా ఖండిస్తున్నారు. రాజకీయాలు రాజకీయాల వరకే పరిమితం చేయాలి ఇలా కుల ప్రస్తావన తేవడం ఏంటని కాపు సంఘాలు మండి పడ్డాయి. పవన్ కల్యాణ్ పై మాట్లాడేటప్పుడు పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని రాయసీమ బలిజ మహా సంఘం అధ్యక్షులు పావురాయి వెంకటేష్ హెచ్చరించారు. అసలు జగన్ ప్రభుత్వం కాపులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్లు చేస్తే కాపులంతా కలిసి తరిమికొడతాం అంటూ హెచ్చరించారు. కాపు మంత్రులతో పవన్ ను తిట్టించడం వెనక జగన్ హస్తం ఉందని కాపు సంక్షమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. పవన్ ను అవమానించడం అంటే కాపు సమాజాన్ని అవమానించడమే అని హరిరామ జోగయ్య అన్నారు. ఇలాంటి నీచమైన చర్యల పర్యవసానాలు 2024 ఎన్నికల్లో జగన్ చూస్తారని హెచ్చరించారు. జగన్ మెప్పుకోసం కొందరు మంత్రులు కులం పేరుతో దూషించడం సిగ్గుచేటు అని కాపు సంక్షేమ సేన నాయకుడు గద్వాల్ రమేష్ అన్నారు. ఒక వ్యక్తి టార్గెట్ గా కాపు కులాన్ని తిడితే ఊరుకునేది లేదని, ఈ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెపుతామని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆ ఓట్లన్నీ దూరమైనట్టేగా
ఈ పరిణామాలతో వైసీపీకి ఓటు వేసిన కాపులంతా జగన్ కు దూరమయ్యే అవకాశం ఉందని. అలాగే జగన్ ను ఎవరైనా విమర్శిస్తే దారుణంగా కుల పరంగా, వ్యక్తిగత దూషణలు, ఆఖరికి కుటుంబ సభ్యులను కించపరిచేలా భూతుల దాడిని జగన్ చేయించదాన్ని ప్రజలందరూ ఏహ్యాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన రివర్స్ అయ్యి కాపు, బలిజ సంఘాలు, కాపు ఓటు బ్యాంకు వైసీపీ కి దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పవన్ ను టార్గెట్ చేస్తూ మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణమురళిల వరుస దూషణలతో వైసీపీ్ఇ లబ్ధి జరగకపోగా.. నష్టమే జరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్పై పోరుకు పీకే రెడీ