ఉద్యమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న హరీశ్ రావుకు, ఎందుకు అగ్గిపెట్టె దొరకలేదో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్ వేశారు. శ్రీకాంత చారికి దొరికిన అగ్గిపెట్టె, హరీశ్ రావుకు ఎందుకు దొరకలేదని, ఆయన అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతున్నాడా? అని అన్నారు. మంత్రి హరీశ్ రావు అంటేనే అబద్ధాలకు కేరాఫ్ అని, తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని సంజయ్ ఆరోపించారు.
‘‘దేశభక్తి సరే… రాష్ట్రంపై మీ భక్తి ఏదని, ప్రాజెక్టులపై అనుమతులు ఇవ్వకూడదని లేఖలు రాస్తారా.. రైతుల నోట్లో మట్టి కొట్టడానికే రాజకీయం చేస్తారా’’ అని బీజేపీ నాయకులను ఉద్దేశించి హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
Also Read:











