May 13, 2026 4:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతిపై కమలం ‘త్రి’కరణశుద్ధి అందుకేనా..

ఏపీ రాజధాని అమరావతి విషయంలో మొన్నటి వరకు పార్టీ పరంగా అంటీముట్టనట్టు ఉన్న బీజేపీ కొన్ని రోజులుగా స్వరం మార్చింది. ఇందుకు ప్రధానంగా మూడు అంశాలు కారణమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

December 18, 2020 at 8:00 AM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ రాజధాని విషయంలో మొన్నటి వరకు పార్టీ పరంగా అంటీముట్టనట్టు ఉన్న బీజేపీ కొన్ని రోజులుగా స్వరం మార్చింది. కొన్నాళ్ల క్రితం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ మద్దతు అమరావతికే అని, ప్రధాని కూడా అమరావతివైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రే ముఖ్యమైనందున కేంద్రం పరిమిత జోక్యం ఉంటుందని, రాజధాని ప్రాంతంలోనే ఎయిమ్స్ ఉంటుందని, కేంద్రం అందుకే ఎయిమ్స్‌కి నిధులు ఇస్తోందని కేంద్రాన్ని కూడా సమర్థించుకునే యత్నం చేశారు. తాజాగా అమరావతిలో రాజధాని కోసం దీక్షలు ప్రారంభించి ఏడాదైన సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనభేరి సభలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మనసా వాచా కర్మనా, త్రికరణశుద్ధిగా అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, ఆఖరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి వ్యాఖ్యానించారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగానే భావిస్తున్న నేపథ్యంలో అమరావతి కోసం ఆకాంక్షిస్తున్నవారు..ఈ వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నా, రాజకీయంగా అమరావతి విషయంలో బీజేపీ అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. అమరావతి విషయంలో గతంలో జరిగిన పరిణామాలు ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

స్వరం మారిన తీరు ఇదీ..

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం అధికారికంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అంతేకాకుండా.. అమరావతి పోరాటంపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీక్షలను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు, మహిళలపై పోలీసుల వ్యవహారశైలి సర్వత్రా విమర్శలు వచ్చినా, ఈ విషయంలోనూ బీజేపీ గట్టిగా మాట్లాడలేదు. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతికి మద్దతు ప్రకటించిన కొన్ని రోజులకే ఆయనను పదవి నుంచి తొలగించడంపైనా అప్పట్లో చర్చ నడిచింది. తరువాత అధికారంలో ఉన్న వైసీపీని వదిలి..ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా పేరున్న సోము వీర్రాజుకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా రాజధాని విషయంలో గతంలో మూడు కాకపోతే..13 రాజధానులు పెట్టుకోండని అనే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు పురంధరేశ్వరి, సుజనాచౌదరి లాంటి వారు అమరావతిపై సానుకూలంగా మాట్లాడితే..వైసీపీ ‘జాతి’నాయకులుగా కామెంట్ చేసిన సందర్భంలోనూ రాష్ట్ర బీజేపీ పెద్దగా ప్రతిఘటించలేదు. రైతులకు భేడీలు వేసిన సందర్భంలోనూ.. ఆపార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు. ఇక ఆ పార్టీ నాయకుడు విష్ణువర్దన్‌రెడ్డి  అమరావతి దీక్షల్లో మహిళలు కట్టుకుంటున్న చీరల విషయంపై కామెంట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అయినా బీజేపీ సరి చేసుకునే ప్రయత్నం అప్పట్లో చేయలేదు. అలాంటి బీజేపీ ఇటీవల స్వరం మార్చింది. తాము అమరావతికే మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా మూడు అంశాలు కారణమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

తిరుపతి ఉప ఎన్నిక..

అమరావతి విషయంలో బీజేపీ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలోనూ ఇంత రాద్ధాంతం అవుతున్న నేపథ్యంలో..తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చే హామీలపై టీడీపీ విమర్శలు చేసే అవకాశం ఉంది. దీంతో బీజేపీ విశ్వసనీయతకు ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. అంటే..ఒక్క అమరావతి విషయమే అయినా..మొత్తం బీజేపీ హామీల విశ్వసనీయతకు ముప్పుగా పరిణమించే ఆస్కారం ఉంది. అధికారం కోసం బీజేపీ ఎలాంటి హామీలైనా ఇస్తుంది..తరువాత మాట మర్చే అవకాశం ఉందనే అభిప్రాయం రాకుండా.. తమ పార్టీ స్టాండ్‌ను చెప్పేందుకు బీజేపీ ఈ వ్యూహం అనుసరిస్తోందని చెప్పవచ్చు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇప్పిస్తామనే రీతిలో ఎక్కడా నాయకులు వ్యాఖ్యానించడం లేదు. ఎంత సేపూ రాష్ట్ర బీజేపీ అమరావతికే జై కొడుతోందని చెబుతున్నారు

Must READ ;- నాకు ఇల్లు లేదన్నారు.. అమరావతిలో ఇల్లు కట్టిన జగనేం పీకాడు: చంద్రబాబు

జిల్లాల్లో పట్టు కోసం

అమరావతి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుతో ఆ ప్రాంతంలో సంబంధం ఉన్న దాదాపు పది నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువేనన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం టీడీపీ మాత్రమే పట్టు సాధించే ఆస్కారం ఉండడం, కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ టైంలో  రాజకీయంగా వైసీపీ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ వేస్తున్న ప్లాన్‌గా భావించవచ్చు. రానున్న కాలంలో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో ఏ ఎన్నిక ముందు జరిగినా సరే.. బీజేపీ గెలిచినా, లేక రెండో స్థానంలో నిలిచినా ఆ ‘సానుకూలత’ను చూపించి ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ వేసిన ప్రణాళిగా భావించవచ్చు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. అమరావతి దీక్షల సందర్భంగా 200రోజులు పూర్తయిన టైంలో ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సంఘీభావ ర్యాలీకి అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మహారాజ్‌ మట్లాడుతూ..అయోధ్య తరహాలో అమరావతి ప్రాంతంలోనూ రామాలయం నిర్మిస్తామని ప్రకటించారు. తరువాత కొన్ని రోజులకే వైసీపీ అసంతృప్త ఎంపీ  రఘురామకృష్ణం రాజు లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నట్లు చెప్పగా, తాను కూడా రూ. పది లక్షల విరాళం ఇస్తానని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ట్వీట్‌ చేశారు. అంటే చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతంలో ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం బీజేపీకి ఉందని చెప్పవచ్చు. ఆ మహాసభకు, బీజేపీకి ప్రత్యక్ష సంబంధం లేకున్నా..సైద్దాంతికంగా ఒకే అంశం వారికి ఉపయోగపడనుంది.

ఒత్తిడి కొనసాగింపు..

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కొన్ని పక్షాలను సందర్భానికి అనుగుణంగా దగ్గరికి తీయవచ్చు..దూరంగా పెట్టవచ్చు.. కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించేందుకు వ్యూహాలూ అమలు చేయవచ్చు. అమరావతి విషయంపై బీజేపీ మద్దతు ప్రకటించడం వైసీపికి కొంత ఇబ్బందే. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీ ఇలా వ్యవహరించడం ఖచ్చితంగా మింగుడు పడని వ్యవహారమే. ఇటీవలే సీఎం జగన్ ధిల్లీ పర్యటన చేశారు. ఆయన ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీపై విమర్శల స్థాయి పెంచారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అంటే రానున్న కాలంలో రాష్ట్రాల నుంచి ఏదైనా అంశంపై కేంద్ర స్థాయిలో బీజేపీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందన్న అనుమానం కూడా ఉండి ఉండవచ్చు. అందులో భాగంగానే రాష్ట్రంలో మీ ఆట మీరు ఆడండి..మా వరకు మేం చూస్తాం అనే సంకేతాలు జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులకు వచ్చాయేమోనన్న చర్చ నడుస్తోంది. అదే టైంలో జనసేనకు కూడా బ్రేక్ వేసినట్లు ఉంటుంది. కొన్నాళ్ల క్రితం పవన్ కల్యాణ్ అమరావతికి సపోర్టుగా పర్యటన చేశారు. దీంతో అటు టీడీపీకి, ఇటు జనసేనకు మాత్రమే అక్కడ మైలేజీ వస్తే తమకు నష్టమని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అమరావతి విషయంలో వ్యూహం మార్చింది. అయితే, రాజకీయ ప్రకటనలకే ఈ వ్యూహం పరిమితమా లేక కార్యాచరణ ఏమైనా ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.

Also Read ;- రైతులపై ప్రేమా.. ఎన్నికల డ్రామానా? : వీర్రాజు నోట అమరావతి మాట

Tags: #Amaravatiamaravati farmersandhra pradeshandhra pradesh bjpap capitalap capital amaravatiap farmersap newsbjpbjp changes stand on cpital amaravathibjp leader satyamurthybjp satyamurthycapital planlatest amaravati newsleotoptelugu news
Previous Post

గయ్యాళి అత్త .. అమాయకపు అమ్మ (సూర్యకాంతం వర్ధంతి ప్రత్యేకం)

Next Post

దెయ్యంగా భయపెట్టనున్న‘అవును’ బ్యూటీ.. !

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఏఆర్ రెహమాన్ కు హైకోర్టు నోటీసులు

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist