January 23, 2021 2:13 PM
27 °c
Hyderabad
23 ° Sat
23 ° Sun
23 ° Mon
23 ° Tue
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ఢిల్లీ యాత్ర వెనుక అసలుసీక్రెట్ ఇదే!

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు? ప్రభుత్వం ప్రకటించేలా ‘రాష్ట్ర అవసరాల కోసం’ అనే మాటను మరచిపోండి. అసలు తెరవెనుక కీలకం మాత్రం ఇదే..!

December 15, 2020 at 2:32 PM
Secret Behind YS Jagans Delhi Tour
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో బీజేపీ దెబ్బకు గులాబీ దళపతి మోడీతో కాళ్ల బేరానికి వచ్చారని కర్ణాకర్ణిగా చాలా వార్తలు వ్యాపిస్తున్నాయి. నిప్పులేనిదే పొగ పుట్టదు. తెలంగాణలో తనకు ఎప్పటికీ తిరుగేలేదన్నట్టుగా ఇన్నాళ్లూ చెలరేగుతూ వచ్చిన గులాబీ దళపతి.. మోడీతో బేరానికి దిగడం కీలక పరిణామం.. వర్తమాన రాజకీయాల్లో ఒక ప్రధాన అధ్యాయం అయితే.. దానికి అనుబంధ అధ్యాయమే ఇవాళ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర. మోడీ తరఫున తెలుగురాష్ట్రాల బాధ్యత తీసుకున్న అమిత్ షా.. వ్యూహాత్మకంగా.. జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటో తదనుగుణంగా నడుచుకోవాల్సిందేనంటూ.. జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా హితవాక్యాలు చెప్పబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

ఏం జరుగుతోంది?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రికి అమిత్ షాతో భేటీ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పోలవరం నిధుల వ్యవహారం, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యల గురించి జగన్- అమిత్ షాతో చర్చిస్తారని అధికారులు ప్రకటించారు. ఇదంతా అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అసలు కారణాలు వేరే ఉన్నాయి.

Must Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

ఏం జరిగింది?

దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ దాదాపు సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. గ్రేటర్ సమరం సందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. ఫలితాలు వచ్చిన తర్వాత.. బీజేపీ దెబ్బకు దారుణంగా భంగపడిన తర్వాత కూడా ఆ పార్టీ మీద తన దాడిని కొనసాగించారు. బీజేపీకి కంటగింపు కలిగించేలా, కాలుముల్లు అనిపించేలా రైతుల బంద్‌కు అధికారికంగా మద్దతిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కమలదళాలకు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున నిరసనగళాలను వినిపించారు.

అయితే ఈ వ్యవహారంలో రెండో ఎపిసోడ్ కు వచ్చేసరికి అనూహ్యంగా స్క్రిప్టు మారిపోయింది. కేసీఆర్ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. ప్రధాని, ఇతర కేంద్రంలోని పెద్దలను కలవడం అనేది కేవలం లాంఛనం కావొచ్చునని, భాజపాయేతర పార్టీలను కూడగట్టడానికి భేటీలు ఉంటాయని కూడా పుకార్లు వినిపించాయి. కానీ జరిగింది వేరు.

కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిశారు. వంగి వంగి దండాలు పెట్టారు. ఈ వాక్యం కాస్త వెటకారంగా అనిపించవచ్చు గానీ.. వాస్తవంలో జరిగిన దానికి అక్షరరూపం అచ్చంగా అదే! మోడీతో భేటీ సందర్భంగా కేసీఆర్ ఏం చెప్పారు? బీజేపీలని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని  బట్టి.. తెరాస తరఫున తాము ఎప్పటికీ బీజేపీకే మద్దతుగా నిలుస్తామని, పైకి రాజకీయ పోకడలు ఎలా ఉన్నప్పటికీ.. మోడీ నిర్ణయాలకు బాసటగా నిలుస్తామని, వ్యక్తిగతంగా తాను తొలినుంచి కాంగ్రెస్ వ్యతిరేకతతోనే పెరిగానని, సహజంగానే మోడీ వర్గానికి అనుకూలంగా ఉండగలనని కేసీఆర్ పదేపదే మోడీకి విన్నవించుకున్నట్లుగా సమాచారం. అయితే- కేసీఆర్ ఎన్నిరకాలుగా మోడీకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. మోడీ సాంతం విని.. తన స్పందన ఏమిటో తెలియజెప్పకుండానే తిప్పిపంపేసినట్లు తెలుస్తోంది. ఈ పుకార్లకు తగినట్టుగానే.. కేసీఆర్ ఢిల్లీనుంచి తిరిగివచ్చిన తర్వాత.. బీజేపీ సర్కారు మీద దాడి ఉధృతి మళ్లీ కనిపించలేదు.

ఇదే సమాచారం మరింత ధ్రువీకరించుకునేలా.. మరికొన్ని  పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బండి సంజయ్‌ను పార్టీ హస్తినపెద్దలు పిలిపించారు. 2023లో తెలంగాణలో కూడా మనమే అధికారంలోకి రాబోతున్నామని.. ప్రస్తుతం తెరాస మీద సాగిస్తున్న దాడి ఉధృతిని ఏమాత్రం తగ్గించాల్సిన అవసరం లేదని బండి సంజయ్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ మోడీని కలిసి వచ్చిన వెంటనే.. బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడంతో.. ఆయనను స్పీడ్ తగ్గించమని  హితవు చెబుతారన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారానికి పూనుకున్న వారంతా షాక్ తిన్నారు. హస్తినలోనే బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ మరింత దూకుడు ప్రదర్శించారు. దీంతో.. బండి సంజయ్ కు హస్తిన పెద్దలు ఎలాంటి సంకేతాలు ఇచ్చారో అర్థమైపోతోంది.

బండి సంజయ్ కు అత్యంత సన్నిహితులైన వారి ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. 2023లో అధికారంలోకి మనమే రాబోతున్నామని.. ఏమాత్రం దూకుడు తగ్గించకుండా దూసుకువెళ్లమని.. సంజయ్ తో ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు సమాచారం.

Also Read ;- జగన్ బావ‌నా మ‌జాకానా.. అనిల్‌కు ఎంత ఫుల్ సెక్యూరిటీనో చూశారా?

ఏం జరగబోతోంది?

ఈ వ్యవహారాలకు సంబంధించి హస్తిన కమలనేతల వ్యూహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కేసీఆర్‌ను మరింతగా చట్రంలో బిగించేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనేది వారి ఆలోచన. అందులో భాగంగానే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హస్తిన పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో జగన్మోహన్ రెడ్డికి మైత్రీబంధం గట్టిగానే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో కూడా.. వైసీపీకి జంటనగరాల్లో ఉన్న నాయకులు కొందరు.. పోటీచేయాలని ఉత్సాహం చూపినప్పటికీ.. జగన్ వారికి బ్రేకులు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలందరూ తెరాస విజయానికి అనుకూలంగా పనిచేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పిలుపు కీలకంగా కనిపిస్తోంది.

అమిత్‌షా ఏం చెప్పబోతున్నారు?

‘మీకూ- కేసీఆర్‌కు స్నేహబంధం ఉంటే దాన్ని పదిలంగా కాపాడుకోండి. స్నేహాన్ని అలాగే కొనసాగించండి. అంతే తప్ప.. ఆ స్నేహాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి’ అనే సందేశాన్ని అమిత్ షా, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నారని సమాచారం. కేసీఆర్ తనంత తానుగా ఢిల్లీ వచ్చి.. సాగిలపడినప్పటికీ.. ఆలకించకుండా.. ఆయనను మరింతగా దెబ్బకొట్టడానికి.. తెలంగాణలో తమ అధికారం ఏర్పడేలా వ్యూహరచన చేయడానికి బీజేపీ నిర్ణయించుకున్నదన్న సంగతి స్పష్టంగానే తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ కు, జగన్మోహన్‌రెడ్డి నుంచి ఎలాంటి నైతికపరమైన సహాయ సహకారాలు  కూడా అందకుండా ఉండేలా.. చట్రం బిగించడమే ఈ పిలుపు వెనుక ఆంతర్యం అని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో జగన్ ను పూర్తిగా సైలెంట్‌గా మార్చడమే వారి ప్రస్తుత టార్గెట్ అని సమాచారం.

తెలుగు రాష్ట్రాలపై ఫోకస్

దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ గరిష్టంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో వారు కొద్దిగా అనుకున్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పై ముందుముందు అదే స్థాయిలో దృష్టిసారించబోతున్నట్లుగా తెలస్తోంది. ఇవాళ అమిత్ షా ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ తో రాజకీయ దూరం పాటించే అవకాశం ఉంటుంది. కానీ.. అదే సమయంలో..  ముందు ముందు ఏపీలో కూడా బలపడడానికి బీజేపీ వైఎస్సార్సీపీని కూడా టార్గెట్ చేయదని గ్యారంటీ ఏముంది. అంతిమంగా తమ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే పార్టీ.. వ్యూహాలను ఏ రీతిగానైనా మార్చుకోడానికి, ఎవరినైనా బలిపెట్టడానికి సదా సిద్ధంగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Also Read ;-, తాడేపల్లి కోటలోకి.. పాత కేసుల్లోని ‘జగన్ దళం’!

Tags: jagan delhi tourjs jagan delhi tourleotopSecret Behind YS Jagans Delhi Tourys jaganYSRCP party
Previous Post

తమిళ్ లోకి డబ్ అయిన బన్నీ ‘అల వైకుంఠపురములో’

Next Post

అందాల ఆకాశంలో అల్లరి జాబిలి ‘శ్రీముఖి’

Related Posts

General

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (124వ జయంతి)..

by chamundi G
January 23, 2021 2:13 pm

సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు వింటే ప్రతి భారతీయుడి గుండె ఉద్వేగంతో ఉప్పొంగుతుంది....

Andhra Pradesh

చంద్రబాబు కోటలో పాగాకు పెద్దిరెడ్డి స్కెచ్ పనిచేస్తుందా?

by లియో రిపోర్టర్
January 23, 2021 1:14 pm

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఓడించి తీరుతానని, లేదంటే...

Andhra Pradesh
chandrababu case

చంద్రబాబు ‘ఏ1’గా కేసు నమోదు..

by chamundi G
January 23, 2021 12:47 pm

రామతీర్థయాత్ర ఇంకా రగులుతూనే ఉన్నట్లుంది. రామతీర్థ దేవాలయం సందర్శించిన సమయంలో విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై...

General

‘పురుగులు’ లిఫ్ట్ అడుగుతాయట!

by chamundi G
January 23, 2021 12:17 pm

సాధారణంగా మనం అత్తి చెట్ల మొదళ్లలో చిన్నచిన్న ఆకు పురుగులను చూస్తుంటాం. అక్కడ...

International

హనుమంతుడు సంజీవని తెచ్చారు.. భారత్ టీకా ఇచ్చింది..

by chamundi G
January 23, 2021 11:40 am

ప్రపంచంలోనే అతి పెద్ద ఔషత తయారీల్లో ఒకటైన భారత్, కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు...

Andhra Pradesh

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

by chamundi G
January 23, 2021 10:46 am

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పంతాన్ని నెరవేర్చుకునే దిశగా మొదటి అడుగు వేశారు....

Andhra Pradesh

సంక్షోభాన్ని తప్పించడమే ‘సుప్రీం’

by లియో రిపోర్టర్
January 23, 2021 10:08 am

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వత్రా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థలకు...

Andhra Pradesh

ఇసుక వివాదం.. అనంత జిల్లాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

by లియో డెస్క్
January 23, 2021 7:00 am

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సీఎంగా మారిన త‌ర్వాత ఏపీలో అన్నింటి కంటే కూడా...

Andhra Pradesh

రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!

by లియో రిపోర్టర్
January 23, 2021 5:11 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం...

Andhra Pradesh

లోక‌ల్‌ నోటిఫికేష‌న్ రెడీ.. జ‌గ‌న్‌ స‌ర్కారు స‌హ‌క‌రించేనా?

by లియో రిపోర్టర్
January 23, 2021 5:05 am

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి శ‌నివారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అఖిలప్రియకు బెయిల్ మంజూరు, రేపు విడుదల

మేడం.. ఫుల్ వీడియో బయటపెడ్తే మీరు సేఫ్!

జగన్ సర్కార్‌కు ‘సుప్రీం’ షాక్!

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు

దటీస్ విజనరీ లీడర్ అంటున్న ‘చంద్రబాబు’ అభిమానులు

‘స్థానికం’పై ఎపీలో సమర భేరి.. క్లైమాక్స్‌పై సర్వత్రా ఆసక్తి!

రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!

వైఎస్సార్ బీమా: చావు తర్వాత కూడా ఆదుకోవడంలేదే!?

బాలయ్య ఆటలో అరటిపండు: కొడాలి నాని

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ముఖ్య కథనాలు

వారాహి వారి చేతికే ‘కేజీఎఫ్ 2’ తెలుగు హక్కులు?   

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

విజయ్ – పూరి ‘లైగర్’ రిలీజ్ ఎప్పుడు.?

చిరు – బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ

చంద్రబాబు కోటలో పాగాకు పెద్దిరెడ్డి స్కెచ్ పనిచేస్తుందా?

మరోసారి వార్తల్లోకి.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

షాక్ లో రాజమౌళి – సంతోషంలో అభిమానులు

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

మెగా కోడలు ఉపాసన ‘నాట్యం’ వెనక ఓ సంధ్య?

సంక్షోభాన్ని తప్పించడమే ‘సుప్రీం’

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

చంద్రబాబు కోటలో పాగాకు పెద్దిరెడ్డి స్కెచ్ పనిచేస్తుందా?

చంద్రబాబు ‘ఏ1’గా కేసు నమోదు..

హనుమంతుడు సంజీవని తెచ్చారు.. భారత్ టీకా ఇచ్చింది..

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సంక్షోభాన్ని తప్పించడమే ‘సుప్రీం’

కారులో ఆధిపత్య పోరు.. టీఆర్ఎస్‌లో అసలేం జరుగుతోంది?

ఇసుక వివాదం.. అనంత జిల్లాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!

లోక‌ల్‌ నోటిఫికేష‌న్ రెడీ.. జ‌గ‌న్‌ స‌ర్కారు స‌హ‌క‌రించేనా?

‘స్థానికం’పై ఎపీలో సమర భేరి.. క్లైమాక్స్‌పై సర్వత్రా ఆసక్తి!

సినిమా

వారాహి వారి చేతికే ‘కేజీఎఫ్ 2’ తెలుగు హక్కులు?   

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

విజయ్ – పూరి ‘లైగర్’ రిలీజ్ ఎప్పుడు.?

చిరు – బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ

కళ్యాణ్ రామ్ స్టోరీని రవితేజ తీసేసుకున్నారా?

హీరో సంపూర్ణేష్ బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

మరోసారి వార్తల్లోకి.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

షాక్ లో రాజమౌళి – సంతోషంలో అభిమానులు

మెగా కోడలు ఉపాసన ‘నాట్యం’ వెనక ఓ సంధ్య?

ధూమ్ ధామ్ గా వరుణ్ ధావన్ మూడు రోజుల పెళ్లి ముచ్చట

‘నారప్ప, ఎఫ్‌ 3’.. రెండింటిలో ఏది ముందు రిలీజ్ కానుంది.?

జనరల్

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (124వ జయంతి)..

‘పురుగులు’ లిఫ్ట్ అడుగుతాయట!

ఇసుక వివాదం.. అనంత జిల్లాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

లోక‌ల్‌ నోటిఫికేష‌న్ రెడీ.. జ‌గ‌న్‌ స‌ర్కారు స‌హ‌క‌రించేనా?

అఖిలప్రియకు బెయిల్ మంజూరు, రేపు విడుదల

స్లమ్ ‘బ్యూటీ’.. ‘మలీశా కర్వా’..

రామతీర్థం రాములోరి కొత్త విగ్రహాలు సిద్ధం

జైల్లో ఉన్న ‘నెచ్చెలి’ శశికళకు కరోనా పాజిటివ్

వైఎస్సార్ బీమా: చావు తర్వాత కూడా ఆదుకోవడంలేదే!?

విజయనగరం జిల్లా మన్యంలో మృత్యుఘోష .. అధికారులు అప్రమత్తం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist