Center Approves Rs 10500 Crore Loan For AP In Addition To Credit Limit:
నిజమేనండోయ్.. అసలే ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు కూడా ప్రతి నెలా అప్పుల బాటే పడుతున్న ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ గోల్డెన్ లెగ్ గానే పరిణమించారనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహదారుగా జగన్ సర్కారు నియమించుకున్న మరునాడే.. రాష్ట్రానికి అదనంగామరో రూ.10,500 కోట్ల మేర రుణాన్ని మంజూరు చేస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వెయ్యి కోట్ల అప్పు కోసం వెయ్యిన్ని మార్గాలు అన్వేషిస్తున్న జగన్ సర్కారుకు ఇది భారీ ఉపశమనం ఇచ్చినట్టే కదా. అందుకే.. ఏపీ సర్కారు పాలిట రజనీష్ కుమార్ గోల్డెన్ లెగ్గేనని చెప్పక తప్పదు.
రుణాల్లో మెజారిటీ ఎస్బీఐ నుంచే
ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వం చేసిన రుణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మంజూరైనవే అధికం. అంతేకాదండోయ్.. అబ్కారీ ఆదాయాన్ని ష్యూరిటీగా చూపెట్టి ఏపీ సర్కారు చేజిక్కించుకున్న రుణంలోనూ ఎస్బీఐ ఇచ్చినదే ఎక్కువ. మొత్తంగా ఆది నుంచి కూడా జగన్ సర్కారుకు ఎస్బీఐ అండగానే ఉంటుందని చెప్పక తప్పదు. అలాంటి ఎస్బీఐకి చైర్మన్గా పనిచేసిన రజనీష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా నియమించుకుని జగన్ మంచి పనే చేశారన్న మాట. ఎందుకంటే.. జగన్ ఎంత కోరితే.. రజనీష్ అంత మొత్తంలో రుణాలు ఇప్పిస్తారు కదా. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐనే దిగ్గజమే కదా. ఈ క్రమంలో ఎస్బీఐ తాను రుణాలు ఇవ్వడమే కాకుండా.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించడంలో కీలక భూమిక పోషిస్తోంది. వెరసి తన అప్పుల కోసం అన్ని లెక్కలు వేసుకున్నాకే.. రజనీష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా నియమించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక దున్నేయడమే!
రజనీష్ కుమార్ ను ఆర్థిక సలహాదారుగా నియమించుకున్న వేళా విశేషమేమో తెలియదు గానీ.. ఆ మరునాడే ఏపీకి తన పరిమితి మించి మరో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అంటే..ఇంకో నాలుగైదు నెలల వరకు వేతనాలు, పెన్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మాట. అయితే ఈ కొత్తగా పుట్టిన అప్పును కూడా జగన్ సర్కారు వేతనాల కోసమే అట్టి పెడుతుందో.. లేదంటే కొత్తగా పుట్టిన అప్పునకు సరిపడేలా ఇంకో కొత్త సంక్షేమయ పథకాన్ని ప్రారంభిస్తుందో చూడాలి. ఎందుకంటే.. రజనీష్ వచ్చీరాగానే ఏకంగా పరిమితి దాటిపోయాక కూడా రూ.10 వేల కోట్లకు పైగా అప్పు పుట్టిందంటే.. ఇక రజనీష్ రంగంలోకి దిగితే..కోరినంత మేర రుణం దొరకడం ఖాయమేనన్న భావనలో వైసీపీ సర్కారు పడిపోయింది. అంటే.. ఇకపైనా అప్పుల విషయంలో కుమ్మేయడమేనన్న మాట.
Must Read ;- వైసీపీలో పెను అలజడి.. రీజనేంటంటే?











