లాక్ డౌన్ టైమ్ లో సోనూసూద్ వలస కార్మికులను తన సొంత ఖర్చులతో గమ్య స్ధానాలకు చేర్చడం తెలిసిందే. ఒకర్నొ ఇద్దర్నొ కాదు వందలు వేల మందిని గమ్యస్ధానాలకు చేర్చారు. అంతే కాకుండా.. కష్టం వచ్చింది అని ఎవరైనా చెబితే చాలు.. నేనున్నాను అంటూ ముందుంటున్నాడు. తెర పై విలన్ గా నటించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనో కాదు యావత్ దేశంలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన చేసిన సేవలకు గాను 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో సోనూసూద్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
యూకేలోని ఈస్టర్న్ ఐ అనే వార్త పత్రిక ఈ విషయాన్ని ప్రచురించడం విశేషం. తెలంగాణలో అయితే.. ఏకంగా సోనూసూద్ కు గుడి కట్టేసారు. తనకు లభిస్తున్న ఆదరణ గురించి.. సోనూసూద్ స్పందిస్తూ… కరోనా సమయంలో నా బాధ్యతగా నేను నా దేశ పౌరులకు అండగా నిలబడ్డాను. ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అప్యాయతలు అందించారు. ఈ కార్యక్రమాలను నా చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాను అని చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే.. సోనూసూద్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.
రీసెంట్ గా ఆచార్య షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే.. సోనూసూద్ ‘ఐయామ్ నో మెస్సియ్యా’ అనే బుక్ ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫేస్ బుక్ లో స్పందిస్తూ… కంగ్రాట్యూలేషన్స్ సోనూసూద్. హీరోలు తయారవుతారు కానీ.. ఎవరు కూడా హీరోలుగా పుట్టరు అని నువ్వు మరోసారి నిరూపించావు అంటూ అభినందించారు. వేల మందికి సహాయం చేసావ్. నీ జర్నీ ఎంతో మందికి స్పూర్తి కలిగిస్తుంది అని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఫోటోను కూడా పోస్ట్ చేసారు మెగాస్టార్.
Must Read ;- సోనూసూద్ సంచలన నిర్ణయం
Congratulations @Sonusood on your book #IamNoMessiah You proved yet again that Heroes are made, Not born. You truly rose to the occasion & helped thousands.Your journey will surely inspire. #IAmNoMessiah in English https://t.co/0ezggmQiLe and Hindi https://t.co/KNhVd7FnJF pic.twitter.com/zRsQSSM16y
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2020