మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని త్వరలోనే తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాకి ఈ మూవీని విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో నటించనున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఎన్.వి. ప్రసాద్ నిర్మాత. పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభించారు. ఆచార్య తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
లూసీఫర్ రీమేక్ తర్వాత చిరంజీవి.. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించేందుకు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను సంప్రదించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ బాబీ సోనాక్షిని కలిసి కథ చెప్పారని.. కథ నచ్చి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.
అయితే.. అధికారికంగా ప్రకటించాల్సివుంది. సోనాక్షి.. రజనీ సరసన లింగా మూవీలో నటించింది. ఈ సినిమాతోనే ఈ బాలీవుడ్ భామ సౌత్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో సక్సస్ కాకపోవడంతో తర్వాత మళ్లీ ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు చిరు సరసన నటించే ఆఫర్ దక్కించుకుంది అంటున్నారు. అలాగే మరో బాలీవుడ్ భామ బిపాసబసును కూడా కాంటాక్ట్ చేసారని టాలీవుడ్ టాక్. ప్రచారంలో ఉన్న వార్తల పై డైరెక్టర్ బాబీ కానీ, నిర్మాణ సంస్థ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read .- జగన్ స్మరణ ‘మెగా’ చిచ్చు పెట్టింది











