రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం కియా కార్లను కొనుగోలు చేయడంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా అంటూ సెటైర్ వేశారు. కియా కార్లను అడిషనల్ కలెక్టర్లకు కేటాయించడం అంటే కలెక్టర్ల స్థాయిని తగ్గించడమేనని అన్నారు. పైస్థాయి అధికారులకు వసతులు కల్పించినట్టే.. కిందిస్థాయి అధికారులకు కూడా కనీస వసతులు అందించాలని డిమాండ్ చేశారు. ఈటల బీజేపీ చేరిక విషయమై స్పందిస్తూ.. ఇండిపెండెంట్ గా ఈటల పోరాటం చేసి ఉన్నట్లయితే తెలంగాణ వాదులంతా అండగా ఉంటారని అన్నారు. బీజేపీలో చేరడం సరైన నిర్ణయం కాదు అని జీవన్ రెడ్డి అన్నారు.
Must Read ;- బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల.. చూడాల్సింది హుజూరాబాద్లో రాజకీయ కురుక్షేత్రమే!











