కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. ఓపెనర్లు పృథ్వీ షా(82) మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. శిఖర్ ధావన్(46), రిషబ్ పంత్ (16) సైతం ఆకట్టుకున్నారు. కోల్కతా పేసర్ పాట్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు.
ఆది నుంచే తడబడుతూ..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది కోల్కతా. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్(43), ఆండ్రూ రసెల్(45) అత్యధిక పరుగులు సాధించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్ ఒక వికెట్ పడకొట్టాడు.
Must Read ;- ఐపీఎల్లో ఆడేందుకు క్రికెటర్లు కావలెను..!











