టాలీవుడ్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు గుణశేఖర్. కొంతకాలంగా గుణ.. మామూలు కమర్షియల్ చిత్రాలకు దూరంగా.. పౌరాణిక , చారిత్రక చిత్రాలకు దగ్గరగా ఉన్న సంగతి తెలిసిందే. ఎర్లియర్ గా తన స్వీయ దర్శకత్వంలో ‘రుద్రమదేవి’ చారిత్రక చిత్రాన్ని నిర్మించిన ఆయన.. ఆ మధ్య రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ‘హిరణ్యకశ్యప’ పౌరాణిక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసుకొని.. శాకుంతలం అనే మరో సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ చిత్రాన్ని ప్రారంభించిన గుణశేఖర్.. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేశాడు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో ‘ప్రతాపరుద్రుడు’ చారిత్రక చిత్రానికి తగిన ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేశాడట. రుద్రమదేవి సినిమా క్లైమాక్స్ లో ‘ప్రతాపరుద్రుడు’ సినిమాకి సంబంధించిన హింట్ ఇచ్చిన గుణశేఖర్ .. ఇప్పుడు ఆ సినిమాని కూడా లైన్ లో పెట్టడం విశేషంగా మారింది. అయితే ఈ సినిమా కోసం ప్రముఖ స్టార్ హీరోను ఒప్పంచే పనిలో ఉన్నాడట గుణ. ఆ హీరో మరెవరోకాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు.
మహేశ్ బాబుతో గుణశేఖర్.. ‘ఒక్కడు, అర్జున్, సైనికుడు’ లాంటి సినిమాలు రూపొందించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ కాగా, ‘అర్జున్’ పర్వాలేదనిపించుకుంది, ‘సైనికుడు’ డిజాస్టర్ అయింది. అప్పటినుంచి గుణశేఖర్ తో మహేశ్ బాబు టచ్ లోనే ఉన్నాడట. నిజానికి ‘రుద్రమదేవి’లో గోనగన్నారెడ్డి పాత్ర కోసం ముందుగా మహేశ్ బాబునే సంప్రదించాడట గుణశేఖర్ . అయితే అప్పట్లో మహేశ్ కి డేట్స్ సమస్య రావడంతో .. ఆ పాత్ర అల్లు అర్జున్ పోషించాడు. ఇప్పుడు ప్రతాపరుద్రుడు సినిమాలో టైటిల్ రోల్ కోసం ఆయన్నే మరోసారి సంప్రదించబోతున్నాడు. ఒకవేళ మహేశ్ ఒప్పుకోని పక్షంలో రానా తోనే ఈ సినిమా తీస్తాడట గుణశేఖర్. మరి మహేశ్ బాబు ‘ప్రతాపరుద్రుడు’ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
Must Read ;- భారీ చారిత్రక చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడట!