కరోనా వైరస్ రెండో దశలోనూ విలయ తాండవం చేస్తోంది. ఉభయ రాష్ట్రాల్లో అంతకంతకు కేసులు పెరిగిపోతున్నాయి. ఎందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో మనకు మాస్కే శరణ్యం అంటూ .. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. నిజానికి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్ కోసం తిరిగి.. బరిలోకి దిగిన మొట్టమొదటి దర్శకుడు రవిబాబే. తన దర్శకత్వంలో కొత్తవారితో తీస్తున్న క్రష్ అనే సినిమా కోసం రవిబాబు .. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ.. ఈ సినిమా షూటింగ్ జరిపాడు. ఇందులోని హీరో, హీరోయిన్స్ చేత వినూత్నంగా మధ్యలో అద్దం పెట్టి.. ముద్దు సీన్ తీసి .. ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు రవిబాబు తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేసి ఇది తన బాధ్యత అని తెలియచెప్పారు. ‘దయచేసి అందరూ మాస్క్ పెట్టుకోండి. ఈ పరిస్థితుల్లో మనల్ని కాపాడేది ఇది ఒక్కటే. ఈ రెన్ డెసిమీర్, ఆక్సిజన్ అవన్నీ హాస్పిటలైజ్ అయిన తర్వాత సంగతి. ముందు మనల్ని హాస్పిటలైజ్ అవకుండా కాపాడుకోవాలి కదా. ముందు ఒక మాస్క్ అన్నారు .. ఆ తర్వాత ఇప్పుడు రెండు మాస్కులంటున్నారు. ప్యూచర్ లో మూడంటారో ఎన్నంటారో తెలియదు. మాస్కేసుకొని మనల్ని మనం గట్టిగా మూసుకోకపోతే.. రేపు మనల్ని ఈ గుడ్డేసి మూసేస్తారు’ అని ప్రజల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- కరోనా వ్యాక్సిన్ : సంతోషమే బలం.. ధైర్యమే బలగం