త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోకి బోలెడంత క్రేజుంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు .. థియేటర్స్ లో అద్భుతాలు సాధించకపోచ్చు. కానీ ఈ రెండు ఎప్పుడు టీవీలో ప్రసారమైనా.. ఏ మాత్రం బోర్ ఫీలవకుండా.. ఎంజాయ్ చేస్తారు వీక్షక ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ఈ కాంబో మరోసారి అభిమానుల్ని అలరించడానికి రెడీ అవుతోంది.
ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు’ వారి పాట సినిమా షూటింగ్ హడావిడిలో ఉన్నాడు. త్రివిక్రమ్.. యన్టీఆర్ 30వ మూవీ చేయాలనుకున్నాడు . కానీ ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల కొరటాల శివ చేతుల్లోకి వెళ్ళింది. దాంతో ఆయన ఇప్పుడు మహేశ్ బాబు తో తన తదుపరి చిత్రానికి సంబంధించిన కథ రచనలో నిమఘ్నమై ఉన్నాడని వినికిడి.
ఇంతకు ముందు త్రివిక్రమ్ మహేశ్ తో తీసిన సినిమాలు రెండూ యాక్షన్ జోనర్ లోనే రూపొందాయి. అయితే ఈ సారి ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేద్దామని మహేశ్ చెప్పాడట. ఆ మేరకు త్రివిక్రమ్.. స్ర్కిప్ట్ వర్క్ ప్రారంభించాడని తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ఫ్యామిలీ మూవీస్ తీయడంలో సిద్ధహస్తుడు. లాస్టియర్ సంక్రాంతికి అల వైకుంఠపురములో ఫ్యామిలీ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే అంతకు ముందు అత్తారింటికా దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ సినిమాలు ఆ జోనర్ లో రూపొంది.. బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మహేశ్ తో ఫ్యామిలీ మూవీ తీయనుండడం విశేషంగా మారింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది.
Must Read ;- మహేశ్ బాబుకి విలన్ గా మాధవన్ .. ఇంతకీ ఏ సినిమా?











