నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ‘అఖండ’. ‘సింహ, లెజెండ్’ బ్లాక్ బస్టర్స్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఉగాది రోజున విడుదలైన టీజర్ ఆ అంచనాల్ని రెట్టింపు చేసింది. ఈ సారి హ్యాట్రిక్ ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. మరోసారి బాలయ్య ద్విపాత్రాభినయంతో థియేటర్స్ దద్దరిల్లుతాయని జోస్యం చెబుతున్నారు.
యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల కానున్న ‘అఖండ’ సినిమా ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకుంది. దీనికి కళ్ళు చెదిరే రీతిలో హ్యూజ్ అమౌంట్ దక్కిందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. దీనికి ఏకంగా రూ. 15కోట్లు ఆఫర్ చేసిందట. అలాగే.. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కోసం భారీ రేటు పలికినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వల్ కథానాయిక గా నటిస్తుంగా.. యస్.యస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో శ్రీకాంత్ ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం మొయినాబాద్ లో ని ఒక రిసార్ట్ లో అఖండ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. అలాగే.. హీరో బాలయ్య, ప్రగ్యా లపై కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేసినట్టు సమాచారం. మరి ఈ సినిమా బాలకృష్ణ, బోయపాటి కి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందేమో చూడాలి.
Must Read ;- అఆ.. అఖండ వర్సెస్ ఆచార్య