నవంబర్ 29 న ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై ఓ తాపీ మేస్త్రీ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన అడుగు పడినట్లు తెలుస్తుంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, సమాచారం మేరకు టీడీపీ నేతలు పరబ్రహ్మం, జిమ్ శివ, శ్రీనివాసులపై విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందేమోనని విచారణకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం ఇప్పటికే 5 గురు పోలీసులు మాజీ మంత్రి ఇంటికి చేరుకుని రవీంద్రను విచారణ నిమిత్తం అదుపులోని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
పేర్ని నాని తల్లి దశ దిన కర్మ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రికి నమస్కారం చేస్తున్నట్లు నటించి దాడికి యత్నించాడు. మంత్రి, చుట్టుపక్కల వాళ్ల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. మంత్రి కొడాలి నాని పై కూడా దాడి జరిగే సమాచారం అందడంతో పోలీసులు మంత్రి కొడాలి నాని భద్రతను పెంచారు. పేర్ని నాని దాడిలో నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రాష్ట్రంలోని వైసీపీ నాయకులకు చీమ కుట్టినా టీడీపీ నాయకులదే బాధ్యత అన్నట్లు ప్రవర్తిస్తుంది జగన్ సర్కార్. కనీసం రవీంద్రపై ఎటువంటి ఆరోపణలు లేకుండానే విచారణ చేయడానికి పోలీసులు సిద్ధపడడం చూస్తుంటే, ఉద్ధేశపూర్వకంగా ప్రభత్వం కక్ష సాధించడానికి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతుంది.
Must Read ;- జగన్ ‘సోషల్’ గా దిగజారాడా.. నేతల బాటలోనే క్యాడర్











