ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు ఏమన్నా ఉన్నయా అని వెతికినా రూపాయి కూడా కనబడడం లేదు. కానీ, త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడులకు బడ్జెట్లో కేంద్రం రెడ్ కార్పెట్ పరచి మరీ కేటాయింపులు ప్రకటించింది. జాతీయ రహదారులు, మెట్రో, రైల్వేలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్లులు కేటాయించింది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలకు పేర్లు కనీసం వినపడను కూడా లేదు. ఏపీకి సంబంధించి విజయవాడ-ఖరగ్పూర్ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ను కేటాయించినట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
ఈ బడ్జెట్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, అయ్యన్న పాత్రుడు తనదైన రీతిలో స్పందించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలిగా ఉన్న కొబ్బరి చిప్ప బొమ్మను తన ట్విట్టర్ ద్వరా షేర్ చేసి.. ‘ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు అద్భుతం నరేంద్ర మోడీ గారు…? ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కృషి చేసిన వైసీపీ ఎంపీలకి, జగన్ గారికి ధన్యవాదాలు..!’ అంటూ వెటకారంగా ఏపీ నిధుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు అద్భుతం @narendramodi…?
ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కృషి చేసిన వైసీపీ ఎంపి లకి @ysjagan కి ధన్యవాదాలు..! #గోరంట్ల pic.twitter.com/Qh7I6nuDWn— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 1, 2021
అంతటితో ఆగకుండా.. ‘యథావిధిగా ఏపీ కి మొండి చెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నరేంద్ర మోడి గారు. బహుశా..ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఏ రాజధానికి కేటాయింపులు చెయ్యాలో తెలియని స్థితి లో కేంద్రం ఉంది అనిపించింది నిర్మలమ్మ గారికి కొంచం వైసీపీ వాళ్ళు ఏ రాజధాని అనేది చెబితే చాలా బాగుండేది జగన్ గారు.!’ అంటూ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు.
Must Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్
యథావిధిగా ఏపీ కి మొండి చెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ @narendramodi
బహుశా..ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఏ రాజధానికి కేటాయింపులు చెయ్యాలో తెలియని స్థితి లో కేంద్రం ఉంది అనిపించింది @nsitharaman
కొంచం వైసీపీ వాళ్ళు ఏ రాజధాని అనేది చెబితే చాలా బాగుండేది @ysjagan.!#గోరంట్ల— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 1, 2021
ఇక అయ్యన్న పాత్రుడు కూడా బడ్జెట్పై తన మాటను పంచుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ వెనక సీట్లో కూర్చుని ఉన్న విజయసాయి రెడ్డి ఫొటోను షేర్ చేసి.. ‘ప్రధాని మోడీ వెనకాల కూర్చున్నా, నేను గొప్పవాడిని అంటూ, నీ పీఆర్ టీంతో డబ్బాలు కొట్టుకుంటే, సర్లే రాష్ట్రం కోసం భారీగా నిధులు తేవటానికి, ఆయన వెనకాల కూర్చుని దువ్వుతున్నావ్ అనుకున్నాం. నువ్వు కాళ్ళు పట్టేది, కాకా పట్టేది, నీ కేసులు కోసం అని, ఈ రోజుతో తేలిపోయింది. కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు కలిసి, మీ కేసుల కోసం ఏపిని అమ్మేసారా ఏంటి ?’ విజయసాయి కేసుల గురించి వెటకారం చేస్తూనే.. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు కలిసి, మీ కేసుల కోసం ఏపిని అమ్మేసారా ఏంటి ?(2/2)@VSReddy_MP
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 1, 2021
2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి బడ్జెట్ వరకు.. ప్రతి సారీ.. ఈ సారైనా కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేస్తుందిలే అనే ఎదురు చూపుల్తోనే ఏళ్లు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా సంగతి పక్కనబెడితే.. కనీసం మెట్రో, నేషనల్ హైవేలు, రైళ్ల ప్రాజెక్టు కేటాయింపులైనా ఉంటాయని ఆశించారు. కానీ ప్రతిసారిలాగే ఈ సారి కూడా మొండి చేయి చూపారు. ఏపీ ప్రజలను పదే పదే చులకన చేస్తున్నారు. ఇక రేపటి నుండి.. ఏపీ బీజేపీ వాళ్లు.. ఏపీకి విజయవాడ-ఖరగ్పూర్ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ప్రకటించారహో అంటూ డప్పు వేసుకుంటూ తిరుగుతారేమో చూడాలి.
Aaso Read ;- బడ్జెట్ ప్రభావం.. ఏవి ప్రియం? వేటిపై తగ్గుదల?