ఏపీ స్థానిక ఎన్నికలు రోజుకో రకమైన మలుపులు తిరుగుతోంది. ఎప్పుడేంజరుగుతుందా అని అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన ఓ విద్యార్ధిని పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది.
ఏపీ ఎన్నికల కమిషన్ విడదల చేసిన స్థానికి ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే దాదాపు 3,60,000 మంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్ పేర్కోన్నారు. ఈ పిటిషన్ రేపు న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Must Read ;- వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్