నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలోని సినిమాను కంప్లీట్ చేసే మూడ్ లో ఉన్నాడు. మే 28న సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ సినిమా పూర్తి కాగానే.. వెంటనే క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతారట. ఇక దీని తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో అతడి దర్శకత్వంలో డిక్టేటర్ అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. దాని రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. బాలకృష్ణ మళ్ళీ శ్రీవాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ప్రముఖ సీనియర్ రైటర్ .. యం.రత్నం స్టోరీ డైలాగ్స్ రాస్తున్నారు.
ఇటీవల యం. రత్నం బాలయ్యకి కథ వినిపించాడట. ఫుల్ యాక్షన్ విత్ ఎమోషన్స్ తో ఈ కథ ఉండడంతో అది బాలయ్య కు ఎంతగానో నచ్చిందట. 2022 లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. రాజమౌళి, బోయపాటి లాంటి దర్శకుల చిత్రాలకు కథ, మాటలు రాసిన యం.రత్నం .. ఇప్పుడు బాలయ్యకి కథ అందించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందట.
Must Read ;- బాలకృష్ణ రైట్ హ్యాండ్ గా జేబీ?











