ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా 30 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం పున:పరీశీలన జరుపుకోవాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం కూడా చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.
వారికి ప్రత్యేకంగా పరీక్షలు పెడతాం
కోవిడ్ వచ్చిన విద్యార్ధులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై కోవిడ్ వచ్చిన విద్యార్ధులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండాలి కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కోవిడ్ వచ్చిన వారికి ప్రత్యేకంగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని, కరోనా వచ్చిన వారు మానసికంగా పరీక్షలు రాయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా, రద్దు చేశారని హైకోర్టు గుర్తు చేసింది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది.
Must Read ;- ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి.. రఘురామరాజు











