బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల హీరో సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హీరో సిద్ధార్థ్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇప్పుడతని చేతిలో సినిమాలు కూడా పెద్దగా లేవు. తన కుటుంబ సభ్యులను రేప్ చేసి చంపేసామంటూ తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయన్నది అతని ఆరోపణ. తన ఫోన్ నంబర్ ను తమిళనాడు భాజపా ఐటీ సెల్ లీక్ చేయడం వల్ల 24 గంటల వ్యవధిలో 500 బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో అతను చురుకుగా ఉన్నాడు.
ఈ కరోనా సమయంలో కూడా అతను జనాన్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాడు. రాష్ట్రంలో ఆక్సిజన్ లేదని ఎవరైనా చెబితే అరెస్టు చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను సిద్ధార్థ్ ట్విట్టర్ లో విమర్శించడంతో భాజపా అతని మీద గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే అతనికి బెదిరిపు కాల్స్ వస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై కూడా అతను విమర్శనాస్త్రాలు సంధించాడు. తనకు వచ్చిన ఫోన్ నంబర్లనన్నింటినీ రికార్డు చేసి పోలీసులకు ఇవ్వనున్నట్లు అతను వివరించాడు.
ఇలా బెదిరింపులు చేస్తే తాను నోరుమూసుకు కోర్చోనని, మళ్లీ మళ్లీ జనానికి చెబుతానంటూ భాజపా ప్రభుత్వ పెద్దలకు చురకలు వేశాడు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు ట్యాగ్ చేశాడు. తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను చూపించాడు. కరోనా నుంచి బయటపడగలం.. కానీ ఇలాంటి వాళ్ల నుంచి మాత్రం బయటపడలేం అంటూ వ్యాఖ్యలు చేశాడు. సిద్దార్థ్ చేసిన ట్వీట్ వల్ల అతను వార్తల్లో వ్యక్తిగా మారాడు.
Must Read ;- ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రుల్లో మరణిస్తున్న కరోనా రోగులు
My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell
Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police.I will not shut up. Keep trying.@narendramodi @AmitShah
— Siddharth (@Actor_Siddharth) April 29, 2021