Is Jagan Got Offer To Join In NDA :
బీజేపీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్టీఏ సర్కారులో చేరాలని ఏపీలోని జగన్కు ఆఫర్ వచ్చిందా అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జగన్ అమిత్ షాను కలిసినప్పుడు ఒక క్యాబినెట్, మరో సహాయ మంత్రి పదవిని కోరగా ఆయన కుదరదన్నట్లు వార్తలొచ్చాయి. ఈ వారంలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఎన్టీఏలో చేరాలని జగన్కు ఆఫరిచ్చినట్లు నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తటస్థ పార్టీలపై కన్ను..
ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి గట్టి తటస్థ పార్టీలైన ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒడిశాలోని బిజూ జనతాదళ్ కోసం బీజేపీ చివరి విడత ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లోపు మరోసారి కేంద్ర కేబినెట్ను విస్తరించే అవకాశాలు లేవని, ఇదే చివరి అవకాశం అంటూ బీజేపీ పెద్దలు ఆయా పార్టీలకు ఫోన్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఎన్డీఏలో చేరకపోతే ఆ తరువాత చేరినా మంత్రివర్గంలో అవకాశాలు అభించకపోవచ్చనే విషయాలను వారికి తెలిపినట్లు సమాచారం. కాగా, తాము తటస్థంగానే ఉంటామంటూ బీజేడీ తెలిపినట్లు, వైసీపీ మాత్రం డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇస్తే.. బేషరతుగా మద్దతు ఇస్తామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం తర్వాత జరిగిన పరిణామాలను బట్టి స్పష్టమౌతోంది. వైసీపీకి సంబంధించిన భాధ్యతను కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, అనేక కేసుల్లో ఉన్న జగన్కు కేంద్రంలోని పెద్దలతో మైత్రి బంధం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ఏన్డీఏ కూటమిలో చేరతారా లేక తటస్థంగానే ఉండి మద్దతు ఇస్తామంటారా అనేది తేలాల్సి ఉంది.
ఎవరికి ఏయే పదవులనే దానిపై..
విస్తరణలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఏయే పోర్టు పోలియోలను కేటాయించాలి, తటస్థ పార్టీలు చేరితే వారికి ఏ పదవులు ఇవ్వాలనే దానిపై చర్చించటానికి ఈ రోజు సాయత్రం బీజేపీ పెద్దలు సమావేశం అవుతున్నారు. ఈ కీలక భేటిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్లు పాల్గొని అన్ని విషయాలను సమగ్రంగా చర్చించనున్నారు. మొత్తానికి ఈ నెల 8న జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.
Must Read ;- సర్థుబాటు ఎక్కడో.. వైవీ సుబ్బారెడ్డిని ధిల్లీకి పంపుతారా?











