అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్..బీహార్ను మించి పోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం లక్కరాజు గార్లపాడులో వైసీపీ నేతల దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ చనిపోయిన గరికపాటి కష్ణారావు కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులు లేకుండా జగన్ జనంలోకి వెళితే తరిమి కొడతారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మహిళా హోం మంత్రి ఉన్న ఏపీలో మహిళలకే రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రహ్మరథం పట్టారు..
నారా లోకేష్ పర్యటనకు గుంటూరు నుంచి గార్లపాడు వరకు యువత బ్రహ్మరథం పట్టారు. గుంటూరు పిడుగురాళ్ల రహదారిలో గంటన్నరపైగా ట్రాఫిక్ జాం అయిపోయింది. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను లోకేష్ ఖండించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరించాలని లేదంటే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని లోకేష్ హెచ్చరించారు.
Must Read ;- ఆ ఇళ్లల్లో ఒక్క ఇటుక కదిపినా ఆందోళన చేస్తా.. నారా లోకేష్ హెచ్చరిక