దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ యన్టీఆర్ తొలిసారిగా ఈ మూవీతో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. విజయదశమి కానుకగా.. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా గురించి ఇప్పటికే బోలెడంత ఆసక్తి నెలకొంది. కారణం ఆయన నెక్స్ట్ హీరో మహేశ్ బాబు కావడమే.
‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత తాను మహేశ్ బాబు తో ఓ వెరైటీ సినిమా తీయబోతున్నానని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అనే ఆసక్తి తో ఉన్నారు అభిమానులు. అంతేకాదు.. మహేశ్ బాబు తో జక్కన్న ‘ఛత్రపతి శివాజీ’ మూవీని తీస్తాడని కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఒక క్రేజీ అప్టేడ్ ఫిల్మ్ వర్గాల వారినుంచి వచ్చింది.
రాజమౌళి మహేశ్ బాబు తో కంప్లీట్ గా అడవుల బ్యాక్ డ్రాప్ లో మూవీ తీయబోతున్నాడట. మెల్ గిబ్సన్ మలిచిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘అపోకలిప్టో’ తరహాలో సాగే ఓ అద్భుతమైన అడ్వెంచరస్ స్టోరీని విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నారట. ఇప్పటికే ఆయన ఈ సినిమా స్ర్కిప్ట్ మొదలు పెట్టారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఈ విజయదశమి రోజునే మొదలు కావచ్చట.
ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. అలాగే.. జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ చిత్రీకరణలో ఉన్నాడు. అప్పటికి ‘ఆర్.ఆర్. ఆర్’ మూవీ విడుదలైపోతుంది. ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించిన మహేశ్ బాబు పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో.. అప్పుడే మహేశ్ బాబు తో రాజమౌళి అరణ్యపర్వం మొదలుపెడతాడట. మరి ఈ సినిమాలో మహేశ్ బాబు కేరక్టర్ ను జక్కన్న ఎలా డిజైన్ చేస్తాడో చూడాలి.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే !