సూపర్ స్టార్ మహేష్ బాబు – టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. సమ్మర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా ఆగింది. ఆతర్వాత కరోనా కాస్త తగ్గిన తర్వాత నవంబర్ నుంచి అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అక్కడ కరోనా తగ్గకపోవడం.. సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో హైదరాబాద్ లోనే షూటింగ్ ప్లాన్ చేశారు.
ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది అనుకుంటే.. దుబాయ్ షూటింగ్ స్టార్ట్ చేయాలని లోకేషన్ దుబాయ్ కి షిప్ట్ చేశారు. అన్ని అడ్డంకులను దాటుకుని ఆఖరికి ఈ రోజు దుబాయ్ లో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా అఫిషియల్ గా తెలియచేసింది. అంతే కాకుండా మోషన్ వీడియో పోస్టర్ ను రిలీజ్ చేసింది.
ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన భారీ కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. మరో వైపు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ కూడా ఉంటుందట. మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు’.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ దూసుకెళుతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అంటున్నారు అభిమానులు.
Must Read ;- మహేష్ కు బాగానే ‘వర్కవుట్’ అవుతున్నట్టుంది!
The auction and the action begins 🎬 #SarkaruVaariPaataShuru 💥💥
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus#SarkaruVaariPaata 🔔 pic.twitter.com/YDPIP8ZJGS
— BARaju (@baraju_SuperHit) January 25, 2021