గబ్బర్ సింగ్ కాంబినేషన్.. అయిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనుందనే విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇందులో పవన్ సరసన మానస రాధాకృష్ణన్ నటించన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో మూవీ రావాలని అభిమానులు కోరుకున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగానే ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా టైటిల్ అండ్ పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేశారు. అయితే… అఫిషియల్ గా రిలీజ్ చేస్తామని.. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మద్దు అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయినా.. అభిమానులు ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అంటూ డిజైన్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ వార్తల పై హీరోయిన్ మానస రాధాకృష్ణన్ స్పందించింది. .తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. సమంత నటించనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీని పై ఇంకా క్లారిటీ రావాల్సివుంది. ఈ సంవత్సరంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడింది. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే.. అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సివుంది.
Must Read ;- మరోసారి పవర్ స్టార్ సరసన సామ్ ?