ఏ సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ మూవీతో మాస్ మహారాజా రవితేజ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. 50 శాతం ఆక్యుపెన్సీ లో కూడా కలెక్షన్స్ వరద పారించిన రవితేజ.. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. దీంతో వరుస సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్న రవితేజ.. రీసెంట్ గా.. ‘ఖిలాడి’ సినిమా చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్ళాడు. అక్కడ కీలకమైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరపుకుంటున్నాయి. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ థ్రిల్లర్ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆ రెండు పాత్రలూ తండ్రీ కొడుకులని వార్తలొస్తున్నాయి.
రీసెంట్ గా రవితేజ ఇటలీ వీధుల్లో ఛిల్ అవుతున్న ఫోటోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. కింద ఛిల్లింగ్ ఇటలీ ఖిలాడి అనే అనే కేప్షన్ పెట్టాడు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కథానాయికలు గా నటిస్తున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఖిలాడీ సినిమా మే 28న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా మాస్ మహారాజాకి ఏ స్థాయి లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ఖిలాడి మాత్రం ఊరుకుంటాడా?