మొన్న ఏలూరు, నిన్న వూళ్ల.. నేడు కొమిరేపల్లి. పశ్చిమ గోదావరిలో వింత వ్యాధి విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వింత వ్యాధి నుంచి ఇంకా విముక్తి లభించినట్లు కనిపంచడం లేదు. ఏలూరు తర్వాత వూళ్ల గ్రామంలో కలకలం సృష్టించింది వింత రోగం. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసందే. వింత వ్యాధిలో ఒకరు మరణించినట్టుగా కూడా వార్తలు వచ్చినా కూడా, డాక్టర్లు ఆ వ్యక్తి గుండెపోటు మరణించినట్టు నిర్ధారించడంతో పరిస్థితి సర్దుమణిగింది.
నేడు మరో గ్రామంలో అంతు చిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలం, కొమిరేపల్లి గ్రామంలో స్ధానికులు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. అంతుచిక్కని వ్యాధి అని స్థానికులు కలవరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. వ్యాధి గురించి వెంటనే చర్యలు తీసుకుని రోగం బారిన పడిన వ్యక్తులకు సరైన చికిత్స అందించాల్సిందిగా గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
Must Read ;- రీ ఎంట్రీ : ఏలూరులో మరల వింత వ్యాధి కలకలం