అక్కినేని మూడో తరం హీరోలు చైతన్య, అఖిల్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న నాగార్జున టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే.. నాగార్జున తనయులు చైతన్య, అఖిల్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇవే. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ లో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇదిలా ఉంటే.. నాగార్జున తనయుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు మూవీలో నటించనున్నారు.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు. అనూప్ రూబెన్స్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం కొన్ని పాటలను రికార్డ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో నాగార్జున చేయాలనుకుంటున్న ఈ సినిమాని జులై లేదా ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. ఇక అఖిల్ తో కూడా నాగార్జున కలిసి నటించడానికి ప్లాన్ చేస్తున్నారు.
నాగార్జున – అఖిల్ కలిసి నటించే భారీ యాక్షన్ మూవీ కోసం లూసీఫర్ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా కథ రెడీ చేస్తున్నారు. కథ విని నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లూసీఫర్ రీమేక్ కంప్లీట్ అయిన తర్వాత నాగ్ – అఖిల్ కాంబినేషన్ లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ ఆడియన్స్ థ్రిల్ కలిగించేలా ఉంటుంది అంటున్నారు. ఇందులో నాగచైతన్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. నాగ్ ఇలా ఒకేసారి కొడుకులిద్దరితో సినిమాలు ప్లాన్ చేస్తుండడం విశేషం.
Must Read ;- నాగార్జున సరసన సోనాక్షి సిన్హా.. ఇంతకీ ఏ సినిమా?