ఆపదంటే .. అండగా నిలుస్తున్నా లోకేష్ ..!
మంగళగిరి, దుగ్గిరాలలో రెండు రోజులు పర్యటించిన నారా లోకేష్.. అన్నా ఆపద అంటే చాలు అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని ఆత్మీయంగా పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చారు. గురువారం మంగళగిరి పట్టణంతోపాటు దుగ్గిరాల, కుంచనపల్లి ప్రాంతాలలో నారా లోకేష్ చేసిన సూడిగాలి పర్యటన విజయవంతంగా ముగిసింది. దుగ్గిరాల బిలాల్ మసీదు లో ప్రత్యేక దువాలో పాల్గొని లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న శ్రీ కోదండ రామచంద్రస్వామి నూతన ఆలయాన్ని పరిశీలించి, ప్రత్యేక పూజలు చేశారు. ఒకే ప్రాంతంలో రెండు పవిత్ర స్థలాలను సందర్శించి తన మతం సర్వమత సమానత్వమని మరోసారి లోకేష్ తన పర్యటనలో చాటుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఓదార్చారు. రెండు రోజుల పర్యటనలో 60 మంది ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను కనుక్కున్నారు లోకేష్.
అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం..!
లోకేష్ తన పర్యటనలో భాగంగా ఏ వీధికి వెళ్ళినా.. తమ సమస్యల గోడును చెప్పుకుంటూ స్థానికులు వాపోతున్నారు. దుగ్గిరాల గ్రామంలో పారిశుద్ధ్యం, రోడ్లు అధ్వానంగా మారాయని స్థానికులు తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి, విద్యుత్తు చార్జీలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుగ్గిరాల ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను అమూల్ పాల సేకరణ కేంద్రానికి ఇవ్వాలని చూస్తున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ రెడ్డి పాలనపై లోకేష్ నిప్పులు చెరిగారు. కరోనా కంటే భయంకరమైన వైరస్ లా జగన్ రెడ్డి మారారని, రాష్ట్రాన్ని, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగరోనా వైరస్ తో మరో రెండేళ్లు కలిసి పోరాటం చేయక తప్పదని లోకేష్ పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక ధరలు, పన్నులు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. విద్యార్థి, ఉద్యోగ, రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. మంగళగిరిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే ఎప్పుడైనా మీ వీధి వచ్చాడా? మీ సమస్యలు పట్టించుకున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు.
పర్యటనలో సర్వత్ర హర్షాతికాలు .. !
లోకేష్ స్పందించే గుణం చూసి పర్యటనలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టమని తెలిపిన క్షణాల్లోనే.. ఆ పని ముగించి మన్ననలను అందుకున్నారు. ‘‘దుగ్గిరాల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడు కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రమాదంలో గాయపడి వ్యక్తికి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని లోకేష్ అందజేసి కుటుంబానికి ధైర్యం చెప్పాడు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు కావాలని అడుగగానే, వెంటనే వాటిని అందించారు’’ అధికారులు తమ ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని లోకేష్ కు విన్నవించుకోగానే.. అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో తమ నేత లోకేష్ .. ఆసాంతం ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సింగిల్ టేక్ లో పరిష్కరించి ప్రజలతో శెహభాష్ అనిపించుకున్నారని కేడర్ సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
Must Read ;- రాష్ట్రంలో దుష్టపాలన అంతానికే టీడీపీలోకి వలసల యాగం..!











