కేసుల్లో ఉన్న కొత్త కార్పోరేటర్ల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసింది. వారు విడుదల చేసిన మొత్తం 25 మందిలో బీజేపీకి చెందిన 10 మంది, టీఆర్ఎస్కు చెందిన 8 మంది, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఉన్నారు. వీరిలో శాలిబండ కార్పోరేటర్ మహ్మద్ ముస్తఫా ఆలీపై అత్యధికంగా ఏడు కేసులున్నాయి. ఐదు కేసులతో మైలార్దేవ్పల్లికి చెందిన టి శ్రీనివాస్రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. కిషన్బాగ్కు చెందిన కె ముబాషిరుద్దీన్, రాంనగర్కు చెందిన టి రవికుమార్లపై నాలుగు కేసులు చొప్పున ఉన్నాయి. బీజేపీకి చెందిన ఆర్కేపురం మహిళా కార్పోరేటర్ వి రాధ, టీఆర్ఎస్కు చెందిన మెట్టుగూడ కార్పోరేటర్ సునీతారెడ్డిలపై ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. గత కౌన్సిల్ లో 30 మంది నేర చరిత్ర గల కార్పోరేటర్లు ఉండగా ప్రస్తుతం 25 మంది ఉన్నారు.
Must Read ;- అనుకున్నదే జరుగుతోంది.. బీజేపీ నాయకుల అంచనా
