ఉగాది నుంచే కొత్త జిల్లాలో పరిపాలన!
రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సమాయక్తమౌతోంది. సీఎస్ ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా ఏర్పాటుపై నెలకొన్న సమస్యలు, భవనాలు, సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాలో కలెకర్లు, ఎస్పీల కార్యకలపాలు సాగించేందుకు అనువైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు జగన్. ప్రస్తుతం ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్, ఐపీఎస్ లకు కొత్త బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే ఓస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది!
వివాదాల మాటేంటి?
ఏపీలోని జిల్లాల పునర్విభజించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వ్యతిరేకిస్తున్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చగొట్టి.. చిచ్చుపెట్టే ప్రతయ్నంలో భాగంగానే కొత్త జిల్లా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న వాదనలు లేకపోలేదు! సెంటిమెంట్స్ ను రెచ్చగొట్టి.. టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నది విపక్షాల విమర్శలు! మరోవైపు కడప, చిత్తూరు, అనంతపురం, గుంటూరు (పల్నాడు), పశ్చిమగోదావరి జిల్లాల విభజన ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలానే వీటితో పాటు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే 15 రెవిన్యూ డివిజన్ల విషయంలో వివాదాలు లేకపోలేదు!
Must Read:-సీఎం జగన్ తో భేటీకి వెళ్లిన మెగా బృందం











