ఈ ఏడాది ‘చెక్, రంగ్ దే’ సినిమాలతో వెంట వెంటనే ప్రేక్షకుల్ని పలకరించాడు యంగ్ హీరో నితిన్. వీటిలో ‘రంగ్ దే’ పర్వాలేదనిపించుకున్నా.. చెక్ కు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దాంతో నితిన్ .. తాజా చిత్రం ‘మాస్ట్రో’ పైనే పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాధున్’ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి దర్శకుడు మేర్లపాక గాంధి. నభానటేశ్ కథానాయికగా, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి జూన్ 11న రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్.
వీలైనంత త్వరగా చిత్రీకరణ ను పూర్తి చేయాలని రంగంలోకి దిగిన ‘మాస్ట్రో’ మూవీ టీమ్ ..అనుకున్నట్టుగా శరవేగంగా సినిమాను షూట్ చేస్తున్నారు. మొన్నామధ్య విడుదలైన మాస్ట్రో ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఇక ఈ సినిమా చిత్రీకరణకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తయితే టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టే. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణం ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేశారు మేకర్స్. కరోనా ఉధృతి తగ్గాకా సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అవుతుంది. నితిన్ కెరీర్ లోనే ప్రయోగాత్మక సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో చూడాలి.
Must Read ;- నితిన్ హీరోగా వక్కంతం వంశీ సినిమా?