న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా టాలీవుడ్ లోకి ప్రవేశించి.. ఫైనల్ గా స్టార్ రైటర్ గా స్థిరపడ్డాడు వక్కంతం వంశీ. ‘కిక్, ఎవడు, రేసుగుర్రం, టెంపర్’ మూవీస్ సూపర్ హిట్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ అనిపించుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా.. కథలు రాయడంలో ఆయన సిద్ధహస్తుడు.
అలా కొంతకాలం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ గా తన హవా కొనసాగించిన ఆయన ..తొలి సారిగా మెగా ఫోన్ పట్టి.. బన్నీతో ‘నా పేరు సూర్య’ సినిమా తెరకెక్కించాడు. సినిమా కథాంశం , టేకింగ్ మెప్పించినా.. అందులో బన్నీ స్టైలాఫ్ వినోదం మిస్ అవడంతో సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత వంశీ.. తన కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
లాక్ డౌన్ టైమ్ లో ఒక కథపై కసరత్తులు చేసిన వక్కంతం .. దాన్ని హీరో నితిన్ కు వినిపించాడట. ఆ కథాంశం నితిన్ ను బాగా ఆకట్టుకోవడంతో పాటు .. ఆ పాత్రను గతంలో తాను చేయకపోవడంతో .. సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అంధాధున్ రీమేక్ .. మాస్ట్రో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నితిన్ .. ఈ సినిమా కంప్లీట్ అవగానే.. వక్కంతం వంశీ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతాడట. మరి నితిన్ తో వక్కంతం ఏ తరహా సినిమా రూపొందిస్తాడో చూడాలి.
Also Read:ఫస్ట్ గ్లింప్స్ : థ్రిల్ చేసే నితిన్ బ్లైండ్ ‘మాస్ట్రో’











