యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్, రంగ్ దే’ చిత్రాలతో వరుసగా థియేటర్స్ లో సందడి చేశాడు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో అలరించకపోవడంతో .. తదుపరి చిత్రం మీద మంచి హోప్స్ పెట్టుకున్నాడు. బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్ గా రూపొందుతున్న ‘మాస్ట్రో’ ఒరిజినల్ తరహాలోనే మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నాడు. మేర్లపాక గాంధి దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్నఈ సినిమా లో నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలక పాత్రలో తమన్నా అలరించబోతోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు నితిన్ సరికొత్త కాంబో మూవీ గురించి కూడా ఓ అప్టేడ్ వచ్చింది. బన్నీతో ‘నా పేరు సూర్య’ తో మెగా ఫోన్ పట్టుకున్న స్టార్ రైటర్ వక్కంతం వంశీతో నితిన్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. దర్శకుడి తొలి చిత్రాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయినప్పటికీ.. వక్కంతం టాలెంట్ పై పూర్తి నమ్మకంతో నితిన్ అతడికి రెండో అవకాశమిచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్ర్కిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఆగస్ట్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళడమే తరువాయి అని తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడట. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా విడుదలవుతుందని వినికిడి. నిజానికి పవర్ పేట సినిమా ముందుగా చేయాల్సి ఉన్నా .. ఇప్పట్లో అది వర్కవుట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే వక్కంతం వంశీ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. మరి వక్కంతం వంశీకి ఈ సినిమాతో అయినా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
Must Read ;- ఫస్ట్ గ్లింప్స్ : థ్రిల్ చేసే నితిన్ బ్లైండ్ ‘మాస్ట్రో’











