సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది. రమణ ప్రమాణ స్వీకారం అనంతరం.. చీఫ్ జస్టిస్కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రతి నమస్కారం చేశారు. ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ నిలుచున్న ఫొటో బయటకు రావడంతో వైరల్ గా మారింది. తెలుగువాళ్లు చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రమణ అనే నేను…
భారత 48వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఇవాళ ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ చరిత్ర సృష్టించారు.
Must Read : సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్
The Vice President, Shri M. Venkaiah Naidu at the swearing-in ceremony of Justice Nuthalapati Venkata Ramana as the 48th Chief Justice of India at Rashtrapati Bhavan today. pic.twitter.com/Qgt2CO1q5a
— Vice-President of India (@VPIndia) April 24, 2021











