తనపై తప్పుడు కేసులు బనాయించి, తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటించకుండా అరెస్టు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై లోక్సభ సెక్రెటేరియట్ స్పందించింది. ఈ నెల 1న ఎంపీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనపై నమోదైన ఫిర్యాదుల గురించి వివరించారు. లోక్సభ ప్రివిలేజెస్ అండ్ ఎథిక్స్ విభాగం ఉప కార్యదర్శి బాలగురు ఆ ఫిర్యాదు కాపీలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపి వాటిపై ఆరా తీయాలంటూ ఆదేశించించారు. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని కోరింది. ఈ ఆదేశాల కాపీలను హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి సాకేత్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాలతో పాటు ఎంపీకి, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు పంపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు లోక్సభ సెక్రెటేరియట్ ఆదేశాలను ఎపీ సీఎస్, డీజీపీల దృష్టికి తీసుకెళ్లి వారి వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్.. ఏమిటీ చర్చ?