PM Modi Listed In RSF 37 Press Freedom Predators Along With Kim Jong-Un And Imran Khan :
ప్రధాని మోదీ మీడియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తమకు అనుకూలమైన ఆంశాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు ఉండటం గమనార్హం.
37 మందిలో మోదీ కూడ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)’ అనే అంతర్జాతీయ సంస్థ ఆరోపించింది. మీడియా అండతో ఆయన తన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న నేతల (Press Freedom Predators) పేర్లతో ఆర్ఎస్ఎఫ్ ఓ జాబితాను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా 37 మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు జాబితాలో ఉన్నారు. మోదీతో పాటు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, మయన్మార్ మిలటరీ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లయాంగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తదితరులు ఆ జాబితాలో ఉన్నారు.
ఇద్దరు మహిళలు
పాలనా పగ్గాలు చేపట్టిన ఇద్దరు మహిళలు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2001లో తొలిసారి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న నేతల జాబితాను ప్రచురించన ఈ సంస్థ మరల 2016 తర్వాత జాబితాను విడుదల చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సద్, ఇరాన్కు చెందిన అలీ ఖమేనీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెలారస్కు చెందిన అలెగ్జాండర్ లుకషెంకోలు 2001 నుంచి ఈ జాబితాలో ఉన్నారు. 2021 ఏడాదికి సంబంధించి 180 దేశాలతో ఆర్ఎస్ఎఫ్ రూపొందించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 142వ స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
Must Read ;- మోదీ కొత్త జట్టు.. 12 మంది అవుట్, 43 మంది ఇన్











